ప్రభుత్వ భూముల పరిరక్షణకు రెవెన్యూ శాఖ కొత్త యాప్
- August 18, 2025
హైదరాబాద్: హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ భూముల రక్షణ కోసం రెవెన్యూ శాఖ సరికొత్త డిజిటల్ యాప్ను అభివృద్ధి చేస్తోంది. బైజాక్యుటీ సొల్యూషన్స్ రూపొందిస్తున్న ఈ యాప్ ద్వారా ప్రభుత్వ భూముల వివరాలను డిజిటల్గా నమోదు చేసి, జియోట్యాగ్ చేయనున్నారు.త్వరలో అందుబాటులోకి రానున్న ఈ యాప్, భూముల నిర్వహణలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుంది. హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడటానికి రెవెన్యూ శాఖ ఒక సరికొత్త డిజిటల్ యాప్ను రూపొందిస్తోంది.
బైజాక్యుటీ సొల్యూషన్స్ అనే ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ దీనిని అభివృద్ధి చేస్తోంది.ఈ యాప్ ద్వారా జిల్లాలోని అన్ని ప్రభుత్వ భూముల వివరాలను డిజిటల్గా నమోదు చేసి పారదర్శకంగా వాటిని పర్యవేక్షించవచ్చని అధికారులు తెలిపారు. ఈ యాప్లో ప్రభుత్వ భూములు, ఖాళీ స్థలాలు, ఇతర ప్రభుత్వ శాఖలకు కేటాయించిన భూములు, అలాగే కోర్టు కేసులలో ఉన్న భూముల వివరాలను కూడా నమోదు చేస్తున్నారు. ప్రభుత్వ భూముల చుట్టూ రెడ్ మార్క్ ఏర్పాటు చేసి, వాటిని జియోట్యాగ్ చేయనున్నారు. దీంతో క్షేత్ర స్థాయిలో, డిజిటల్ మ్యాప్లో భూముల కొలతల్లో ఏ మాత్రం తేడా ఉండదు. ఈ యాప్ లోని జియోట్యాగ్ చేసిన చిత్రాలు, వివరాలు భూ కబ్జా ప్రయత్నాలను గుర్తించడంలో సహాయపడతాయి. అవసరమైతే, ఈ చిత్రాలను కోర్టులో చట్టపరమైన సాక్షాలుగా ఉపయోగించవచ్చు.భవిష్యత్తులో ఈ యాప్ తో ఒకే క్లిక్తో మొత్తం జిల్లాలోని ప్రభుత్వ భూముల వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.
దీనివల్ల అధికారులకు, ప్రజలకు సమయం అవుతుంది. ప్రస్తుతం ఆదా విధానాన్ని ప్రయోగాత్మకంగా ఒకటి, రెండు జిల్లాల్లో అమలు చేస్తున్నారు. అయితే హైదరాబాద్ జిల్లా యాప్లో మరిన్ని అదనపు ఫీచర్లను చేర్చనున్నారు. జిల్లాలోని 16 మండలాల్లో తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను సందర్శించి, కబ్జాకు గురయ్యాయా లేదా కోర్టు కేసులు ఉన్నాయా వంటి వివరాలను కూడా ప్రత్యేకంగా యాప్ లో నమోదు చేస్తున్నారు. ఈ యాప్ రానున్న ఒకటి, రెండు నెలల్లో అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు. ఇది ప్రభుత్వ భూముల నిర్వహణలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలకనుంది.
తాజా వార్తలు
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్







