టాయిలెట్ కట్టు 'కబాలి' టిక్కెట్ పట్టు

- July 17, 2016 , by Maagulf
టాయిలెట్ కట్టు 'కబాలి' టిక్కెట్ పట్టు

దక్షిణాది రాష్ట్రాలను కబాలి ఫీవర్ పట్టుకుంది. సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ఈ చిత్రం ఈనెల 22న రిలీజ్ కానుంది. అయితే రజినీ ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ ఆఫర్‌ను ప్రకటించింది. పుదుచ్చేరి ప్రజలకు కబాలి టికెట్ ను కానుకను ఇచ్చేందుకు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ఓ ప్లాన్‌ వేసింది. రాష్ట్ర ప్రజలు ఎవరైతే తమ ఇంట్లో టాయిలెట్‌ను నిర్మిస్తారో వాళ్లకు కబాలి ఫిల్మ్ టికెట్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు పుదుచ్చేరి ప్రభుత్వం ప్రకటించింది. టాయిలెట్ నిర్మిస్తే, కబాలి టికెట్ అన్న నినాదంతో కేంద్ర ప్రభుత్వం ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ పథకంలో భాగంగా ఈ ఆఫర్ ను ప్రకటించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com