టాయిలెట్ కట్టు 'కబాలి' టిక్కెట్ పట్టు
- July 17, 2016
దక్షిణాది రాష్ట్రాలను కబాలి ఫీవర్ పట్టుకుంది. సూపర్స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ఈ చిత్రం ఈనెల 22న రిలీజ్ కానుంది. అయితే రజినీ ఫ్యాన్స్ను ఆకట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ ఆఫర్ను ప్రకటించింది. పుదుచ్చేరి ప్రజలకు కబాలి టికెట్ ను కానుకను ఇచ్చేందుకు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ఓ ప్లాన్ వేసింది. రాష్ట్ర ప్రజలు ఎవరైతే తమ ఇంట్లో టాయిలెట్ను నిర్మిస్తారో వాళ్లకు కబాలి ఫిల్మ్ టికెట్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు పుదుచ్చేరి ప్రభుత్వం ప్రకటించింది. టాయిలెట్ నిర్మిస్తే, కబాలి టికెట్ అన్న నినాదంతో కేంద్ర ప్రభుత్వం ఓ పోస్టర్ను కూడా రిలీజ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ పథకంలో భాగంగా ఈ ఆఫర్ ను ప్రకటించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







