హ్యూమన్ క్యాపిటల్ సమ్మిట్లో పాల్గొనాల్సిందిగా కేటీఆర్కు ఆహ్వానం..
- July 17, 2016
తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు శ్రీలంక ప్రభుత్వం ఆహ్వానం అందించింది. వచ్చే నెల 11, 12 తేదీల్లో కొలంబోలో నిర్వహించే హ్యూమన్ క్యాపిటల్ సమ్మిట్లో పాల్గొనాల్సిందిగా కేటీఆర్కు ఆహ్వానం పలికింది. దేశ విధానాలు, శిక్షణా కార్యక్రమాలు, ఉద్యోగాలకు యువత సంసిద్ధం అంశాలపై శ్రీలంక ప్రధాని విక్రమ సింఘేతో పాటు కేటీఆర్ ఈ సమ్మిట్లో కీలక ఉపన్యాసం చేయనున్నారు.
దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. శ్రీలంక ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టన శిక్షణ, నైపుణ్య కార్యక్రమాలను శ్రీలంకలో వివరిస్తానని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







