తాను తెలంగాణను వదలలేదన్న ఏపీ ముఖ్యమంత్రి..
- July 18, 2016
తాను తెలంగాణను వదలలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. టీడీపీ తెలంగాణ నేతల భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా టీడీపీ అధికారంలోకి రావాలన్నారు. నాయకుల పనితీరుపై ప్రతినెల నివేదిక తెప్పించుకుంటానని, అంతమాత్రాన ఆంధ్రా నుంచి దిశానిర్దేశం చేసినట్టు భావించొద్దని ఆయన కోరారు. సొంత నిర్ణయాలతో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని, అంతేకాని ప్రతి దానికి ఏపీతో పోల్చుకోవద్దని టీటీడీపీ నేతలకు చంద్రబాబు దిశానిర్థేశం చేశారు. ఏపీలో సెన్సార్ విధానంతో పథకాల అమలును పరిశీలిస్తున్నామని, మీ పనితీరును అలాగే తెలుసుకుంటానని సరదాగా అన్ననని బాబు చెప్పారు. భేటీ సమయంలోనే టీటీడీపీ నేతలకు విశాఖలో ఎల్ఈడీ బల్బుల సిస్టం పనితీరుపై సెన్సార్ విధానాన్ని ల్యాప్ట్యాప్లో చూపించారు. అందులో 90 వేల బల్బుల్లో 45 వేలు వెలుగుతున్నాయని కనిపించిందని తెలిపారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







