సీపీఐ సీనియర్ నేత సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత..
- August 22, 2025
హైదరాబాద్: సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారు.కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. 1998, 2004లో లోక్ సభ ఎంపీగా గెలిచారు సుధాకర్ రెడ్డి. 2012 నుంచి 2019 వరకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. సురవరం సీపీఐలో అంచెలంచెలుగా ఎదిగారు. రాష్ట్ర కార్యదర్శి నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు.
అనారోగ్య సమస్యలతో సురవరం కొంతకాలం ఆసుపత్రికే పరిమితం అయ్యారు. తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.పార్టీలోనూ క్రియాశీలక పాత్ర పోషించారు సురవరం సుధాకర్ రెడ్డి. తెలంగాణ నుంచి సుదీర్ఘ కాలం పాటు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తన జీవిత కాలం పార్టీ కోసం అంకిత భావంతో పని చేసిన నేతగా గుర్తింపు పొందారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









