తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- August 27, 2025
తిరుమల: చంద్రుడు ఎరుపు వర్ణంలో కనిపించనున్నాడు. అదెలా సాధ్యమని అనుకుంటున్నారా? చంద్రగ్రహణం వల్ల ఏర్పడే ఈ దృశ్యాన్ని బ్లడ్ మూన్ అంటారు. వచ్చేనెల 7-8 రాత్రి సమయంలో బ్లడ్ మూన్ కనపడనుంది.
చంద్రగ్రహణం నేపథ్యంలో తిరుమల శ్రీవారి భక్తులకు స్వామివారి సేవలకు సంబంధించి అధికారులు కీలక సమాచారం ఇచ్చారు. సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
సెప్టెంబర్ 7 సాయంత్రం 3.30 గంటల నుంచి సెప్టెంబర్ 8 ఉదయం 3 గంటల వరకు (12గంటల పాటు) శ్రీవారి ఆలయం మూసివేస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ 7న రాత్రి 9.50 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభం కానుంది.
సెప్టెంబర్ 8న వేకువజామున 1.31 గంటలకు వరకు కొనసాగనుంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆనవాయితీగా ఆలయం తలుపులు మూసివేయనుంది టీటీడీ.
సెప్టెంబర్ 8న ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవాచనం జరుపుతారు. తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలు ఏకాంతంగా జరుగుతాయి.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







