తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- August 27, 2025
తిరుమల: చంద్రుడు ఎరుపు వర్ణంలో కనిపించనున్నాడు. అదెలా సాధ్యమని అనుకుంటున్నారా? చంద్రగ్రహణం వల్ల ఏర్పడే ఈ దృశ్యాన్ని బ్లడ్ మూన్ అంటారు. వచ్చేనెల 7-8 రాత్రి సమయంలో బ్లడ్ మూన్ కనపడనుంది.
చంద్రగ్రహణం నేపథ్యంలో తిరుమల శ్రీవారి భక్తులకు స్వామివారి సేవలకు సంబంధించి అధికారులు కీలక సమాచారం ఇచ్చారు. సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
సెప్టెంబర్ 7 సాయంత్రం 3.30 గంటల నుంచి సెప్టెంబర్ 8 ఉదయం 3 గంటల వరకు (12గంటల పాటు) శ్రీవారి ఆలయం మూసివేస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ 7న రాత్రి 9.50 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభం కానుంది.
సెప్టెంబర్ 8న వేకువజామున 1.31 గంటలకు వరకు కొనసాగనుంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆనవాయితీగా ఆలయం తలుపులు మూసివేయనుంది టీటీడీ.
సెప్టెంబర్ 8న ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవాచనం జరుపుతారు. తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలు ఏకాంతంగా జరుగుతాయి.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!