మస్కట్ లో థాయిలాండ్ ఫెస్టివల్..ప్రవేశం ఉచితం..!!
- August 27, 2025
మస్కట్: ఆగస్టు 28 నుండి 30 మస్కట్ వేదికగా థాయిలాండ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఆట్రియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.దీనికి థాయిలాండ్ టూరిజం అథారిటీ, థాయ్ ట్రేడ్ ఆఫీస్, థాయ్ కంపెనీలు మద్దతు ఇస్తున్నాయి. ఒమన్లోని థాయ్ కమ్యూనిటీ సహకారంతో మస్కట్లోని థాయ్ రాయబార కార్యాలయం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.
అందరికి ప్రవేశం ఉచితం. “ది గిఫ్ట్,” “అండర్ ది వింగ్స్ ఆఫ్ డ్రీమ్స్,” మరియు “లెటర్ ఫ్రమ్ ది సన్,” అలాగే బర్నెట్ థాయిలాండ్ చేసిన థాయ్ సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. వీటిలో “సౌండ్ ఆఫ్ లన్నా,” “బ్యాంకాక్ జాయ్,” “సదరన్ బ్రీజ్,” “అమేజింగ్ థాయిలాండ్,” “క్యాండిల్లైట్ ఇన్ చియాంగ్ మై,” “ఫ్లేవర్స్ ఆఫ్ ఇసాన్,” “పింక్ లోటస్,” “లోయ్ క్రా థాంగ్ సుఖోథాయ్,” మరియు “సాంగ్క్రాన్ వాటర్ ఫెస్టివల్” వంటి తొమ్మిది ప్రదర్శనలు ప్రత్యేకంగా ఉంటాయని వెల్లడించారు.
ఈ థాయ్ ఫెస్టివల్ ఆగస్టు 28 (గురువారం) మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 10:00 గంటల వరకు ఉంటుందన్నారు. ఇక ఆగస్టు 29 మరియు 30వ తేదీల్లో మధ్యాహ్నం 2:00 నుండి రాత్రి 10:00 గంటల వరకు ఉంటుందని ప్రకటించారు.
వీటితోపాటు ప్యాడ్ థాయ్, టామ్ యమ్ కుంగ్, సోమ్ టామ్ మరియు అనేక ఇతర థాయ్ వంటకాలతో పాటు రుచికరమైన థాయ్ ఐస్ క్రీం, డ్రై ఫ్రూట్స్ మరియు డెజర్ట్లు వంటి ప్రసిద్ధ ప్రామాణికమైన థాయ్ ఫుట్ స్టాల్స్ ఉంటాయని తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









