హాప్ ఆన్ హాప్ ఆఫ్ డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- August 29, 2025
విశాఖపట్నం: విశాఖపట్నం బీచ్ రోడ్డులో పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన హాప్ ఆన్-హాప్ ఆఫ్ డబుల్ డెక్కర్ బస్సు సేవలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా పాల్గొన్నారు.
ప్రారంభోత్సవం అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి కందుల దుర్గేష్, ఇతర ప్రజాప్రతినిధులు కలిసి డబుల్ డెక్కర్ బస్సులో ఆర్కే బీచ్ నుంచి బీచ్ రోడ్డు మీదుగా ప్రత్యేక ప్రయాణం చేశారు.ఈ సందర్భంగా బస్సులో ప్రయాణించిన ముఖ్యమంత్రి పర్యాటకులకు అభివాదం చేస్తూ వారితో మాట్లాడారు.
మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, విశాఖ పర్యాటక అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేపట్టిన ఈ నూతన సేవ పర్యాటకులకు ఆకర్షణీయంగా, వినోదభరితంగా నిలుస్తుందని తెలిపారు.బీచ్ రోడ్డులోని అందాలను ఆస్వాదించేందుకు ఈ డబుల్ డెక్కర్ బస్సులు పర్యాటకులకు కొత్త అనుభూతిని కలిగిస్తాయని అన్నారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









