హాప్ ఆన్ హాప్ ఆఫ్ డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- August 29, 2025
విశాఖపట్నం: విశాఖపట్నం బీచ్ రోడ్డులో పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన హాప్ ఆన్-హాప్ ఆఫ్ డబుల్ డెక్కర్ బస్సు సేవలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా పాల్గొన్నారు.
ప్రారంభోత్సవం అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి కందుల దుర్గేష్, ఇతర ప్రజాప్రతినిధులు కలిసి డబుల్ డెక్కర్ బస్సులో ఆర్కే బీచ్ నుంచి బీచ్ రోడ్డు మీదుగా ప్రత్యేక ప్రయాణం చేశారు.ఈ సందర్భంగా బస్సులో ప్రయాణించిన ముఖ్యమంత్రి పర్యాటకులకు అభివాదం చేస్తూ వారితో మాట్లాడారు.
మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, విశాఖ పర్యాటక అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేపట్టిన ఈ నూతన సేవ పర్యాటకులకు ఆకర్షణీయంగా, వినోదభరితంగా నిలుస్తుందని తెలిపారు.బీచ్ రోడ్డులోని అందాలను ఆస్వాదించేందుకు ఈ డబుల్ డెక్కర్ బస్సులు పర్యాటకులకు కొత్త అనుభూతిని కలిగిస్తాయని అన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









