హాప్ ఆన్ హాప్ ఆఫ్ డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- August 29, 2025
విశాఖపట్నం: విశాఖపట్నం బీచ్ రోడ్డులో పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన హాప్ ఆన్-హాప్ ఆఫ్ డబుల్ డెక్కర్ బస్సు సేవలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా పాల్గొన్నారు.
ప్రారంభోత్సవం అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి కందుల దుర్గేష్, ఇతర ప్రజాప్రతినిధులు కలిసి డబుల్ డెక్కర్ బస్సులో ఆర్కే బీచ్ నుంచి బీచ్ రోడ్డు మీదుగా ప్రత్యేక ప్రయాణం చేశారు.ఈ సందర్భంగా బస్సులో ప్రయాణించిన ముఖ్యమంత్రి పర్యాటకులకు అభివాదం చేస్తూ వారితో మాట్లాడారు.
మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, విశాఖ పర్యాటక అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేపట్టిన ఈ నూతన సేవ పర్యాటకులకు ఆకర్షణీయంగా, వినోదభరితంగా నిలుస్తుందని తెలిపారు.బీచ్ రోడ్డులోని అందాలను ఆస్వాదించేందుకు ఈ డబుల్ డెక్కర్ బస్సులు పర్యాటకులకు కొత్త అనుభూతిని కలిగిస్తాయని అన్నారు.
తాజా వార్తలు
- భారత మేధో, సాంస్కృతిక పునరుజ్జీవనానికి బెంగాల్ కేంద్రబిందువు: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- భారత్ ఫస్ట్ స్లీపర్ AC కోచ్, 5-స్టార్ హోటల్ కూడా తలదించాల్సిందే!
- సర్ (SIR) ప్రక్రియ: ఓటరు జాబితా ప్రక్షాళనలో కీలక అడుగు
- యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- మచిలీపట్నం బస్స్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఉండవల్లి గుహల వద్ద బాబా రామ్దేవ్ యోగాభ్యాసం
- ముంబై ఐఐటీ క్యాంపస్లో చిరుతపులి కలకలం
- బ్యాంకింగ్ రంగంలో దివ్యాంగుల హక్కుల ఉల్లంఘనపై UBIDEF ఆందోళన
- యూఏఈలో ఎండలు మండుతున్నాయి..49.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు
- కువైట్లో యోగా వేడుకల్లో 2,200 మందికి పైగా భాగస్వామ్యం..!!







