సౌదీలో వాణిజ్య ఫ్రాడ్ కేసు..2ఏళ్ల జైలుశిక్ష.. SR350000 ఫైన్..!!
- August 29, 2025
రియాద్: వాణిజ్యపరమైన సమాచారాన్ని దాచిపెట్టినందుకు సౌదీ కోర్టు ఒక సౌదీ పౌరుడు మరియు నలుగురు ప్రవాసులకు రెండు సంవత్సరాల జైలుశిక్ష, SR350000 జరిమానా విధించింది. ఈ కేసులో మరో సౌదీ పౌరుడిని కూడా దోషిగా నిర్ధారించారు. నేరం ద్వారా వచ్చిన SR293 మిలియన్లకు పైగా మొత్తాన్ని.. 26 వాహనాలను జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. ఆయా సంస్థల మూసివేత, వాటి లైసెన్స్లు మరియు వాణిజ్య రిజిస్ట్రేషన్లను రద్దు, జైలు శిక్ష మరియు జరిమానాలు చెల్లించిన తర్వాత ప్రవాస దోషులను దేశం నుండి బహిష్కరించాలని కోర్టు తన ఉత్తర్వుల్లో ఆదేశించింది.
ఖాసిమ్ ప్రాంతంలోని కాంట్రాక్టు, వైద్య పరికరాలు మరియు పొగాకు సంబంధిత వ్యాపారాలలో నిందితులు అనేక నేరాలకు పాల్పడినట్లు తేలిన తర్వాత దిగువ కోర్టు జారీ చేసిన తీర్పును ఖాసిమ్ అప్పీల్ కోర్టు సమర్థించింది. దోషులలో సౌదీలు, యెమెన్లు మరియు పాలస్తీనియన్లు ఉన్నారు.
విదేశీ పెట్టుబడి లైసెన్స్ లేకుండా నలుగురు ప్రవాసులు వాణిజ్య కార్యకలాపాలను నిర్వహించారని, వారికి సౌదీ పౌరులు సహకరించారని కోర్టు గుర్తించింది. ఒక కంపెనీతోపాటు నాలుగు అనుబంధ సంస్థలను నప్రవాసులు స్వేచ్ఛగా నిర్వహించారని.. వారు తమ చట్టవిరుద్ధ కార్యకలాపాల ద్వారా వచ్చిన నిధులను ఇతర దేశాలకు బదిలీ చేశారని అధికారులు విచారణలో గుర్తించి, కేసులు నమోదు చేశారు.
తాజా వార్తలు
- సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రథమ స్థానం
- ఏపీ కేబినెట్లో 34 కీలక అంశాలకు ఆమోదం..
- ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.557కోట్లు !!
- హైదరాబాద్లో నో టాలరెన్స్ జోన్ల ఏర్పాటు
- దుబాయ్ కస్టమ్స్ కీలక నిర్ణయం..Dh1,000 వరకు దిగుమతి వస్తువులకు కస్టమ్స్ సుంకం మినహాయింపు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!







