సౌదీలో వాణిజ్య ఫ్రాడ్ కేసు..2ఏళ్ల జైలుశిక్ష.. SR350000 ఫైన్..!!
- August 29, 2025
రియాద్: వాణిజ్యపరమైన సమాచారాన్ని దాచిపెట్టినందుకు సౌదీ కోర్టు ఒక సౌదీ పౌరుడు మరియు నలుగురు ప్రవాసులకు రెండు సంవత్సరాల జైలుశిక్ష, SR350000 జరిమానా విధించింది. ఈ కేసులో మరో సౌదీ పౌరుడిని కూడా దోషిగా నిర్ధారించారు. నేరం ద్వారా వచ్చిన SR293 మిలియన్లకు పైగా మొత్తాన్ని.. 26 వాహనాలను జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. ఆయా సంస్థల మూసివేత, వాటి లైసెన్స్లు మరియు వాణిజ్య రిజిస్ట్రేషన్లను రద్దు, జైలు శిక్ష మరియు జరిమానాలు చెల్లించిన తర్వాత ప్రవాస దోషులను దేశం నుండి బహిష్కరించాలని కోర్టు తన ఉత్తర్వుల్లో ఆదేశించింది.
ఖాసిమ్ ప్రాంతంలోని కాంట్రాక్టు, వైద్య పరికరాలు మరియు పొగాకు సంబంధిత వ్యాపారాలలో నిందితులు అనేక నేరాలకు పాల్పడినట్లు తేలిన తర్వాత దిగువ కోర్టు జారీ చేసిన తీర్పును ఖాసిమ్ అప్పీల్ కోర్టు సమర్థించింది. దోషులలో సౌదీలు, యెమెన్లు మరియు పాలస్తీనియన్లు ఉన్నారు.
విదేశీ పెట్టుబడి లైసెన్స్ లేకుండా నలుగురు ప్రవాసులు వాణిజ్య కార్యకలాపాలను నిర్వహించారని, వారికి సౌదీ పౌరులు సహకరించారని కోర్టు గుర్తించింది. ఒక కంపెనీతోపాటు నాలుగు అనుబంధ సంస్థలను నప్రవాసులు స్వేచ్ఛగా నిర్వహించారని.. వారు తమ చట్టవిరుద్ధ కార్యకలాపాల ద్వారా వచ్చిన నిధులను ఇతర దేశాలకు బదిలీ చేశారని అధికారులు విచారణలో గుర్తించి, కేసులు నమోదు చేశారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









