సౌదీలో వాణిజ్య ఫ్రాడ్ కేసు..2ఏళ్ల జైలుశిక్ష.. SR350000 ఫైన్..!!
- August 29, 2025
రియాద్: వాణిజ్యపరమైన సమాచారాన్ని దాచిపెట్టినందుకు సౌదీ కోర్టు ఒక సౌదీ పౌరుడు మరియు నలుగురు ప్రవాసులకు రెండు సంవత్సరాల జైలుశిక్ష, SR350000 జరిమానా విధించింది. ఈ కేసులో మరో సౌదీ పౌరుడిని కూడా దోషిగా నిర్ధారించారు. నేరం ద్వారా వచ్చిన SR293 మిలియన్లకు పైగా మొత్తాన్ని.. 26 వాహనాలను జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. ఆయా సంస్థల మూసివేత, వాటి లైసెన్స్లు మరియు వాణిజ్య రిజిస్ట్రేషన్లను రద్దు, జైలు శిక్ష మరియు జరిమానాలు చెల్లించిన తర్వాత ప్రవాస దోషులను దేశం నుండి బహిష్కరించాలని కోర్టు తన ఉత్తర్వుల్లో ఆదేశించింది.
ఖాసిమ్ ప్రాంతంలోని కాంట్రాక్టు, వైద్య పరికరాలు మరియు పొగాకు సంబంధిత వ్యాపారాలలో నిందితులు అనేక నేరాలకు పాల్పడినట్లు తేలిన తర్వాత దిగువ కోర్టు జారీ చేసిన తీర్పును ఖాసిమ్ అప్పీల్ కోర్టు సమర్థించింది. దోషులలో సౌదీలు, యెమెన్లు మరియు పాలస్తీనియన్లు ఉన్నారు.
విదేశీ పెట్టుబడి లైసెన్స్ లేకుండా నలుగురు ప్రవాసులు వాణిజ్య కార్యకలాపాలను నిర్వహించారని, వారికి సౌదీ పౌరులు సహకరించారని కోర్టు గుర్తించింది. ఒక కంపెనీతోపాటు నాలుగు అనుబంధ సంస్థలను నప్రవాసులు స్వేచ్ఛగా నిర్వహించారని.. వారు తమ చట్టవిరుద్ధ కార్యకలాపాల ద్వారా వచ్చిన నిధులను ఇతర దేశాలకు బదిలీ చేశారని అధికారులు విచారణలో గుర్తించి, కేసులు నమోదు చేశారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









