35 మంది పిల్లలకు స్వాగతం పలికిన ఖతార్ మ్యూజియమ్స్..!!
- August 29, 2025
దోహా: ఖతార్ ఫౌండేషన్ (QF) స్థాపించిన ఖతార్ కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ (QCDC) నిర్వహించే ‘లిటిల్ ఎంప్లాయీ’ ఐదవ ఎడిషన్లో భాగంగా ఆగస్టు 27న 35 మంది పిల్లలకు ఖతార్ మ్యూజియమ్స్ (QM) స్వాగతం పలికింది. రోజంతా, పిల్లలు తమ తల్లిదండ్రులు మరియు బంధువులతో కలిసి అనేక కార్యక్రమాలలో పాల్గొన్నారు.
ఖతార్ మ్యూజియంల CEO మొహమ్మద్ సాద్ అల్ రుమైహి మాట్లాడుతూ.. యువ తరానికి మ్యూజియమ్స్ ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుందన్నారు. ఇక్కడ నిర్వాహకులు, చరిత్రకారులు, డిజైనర్లు, పరిరక్షకులు మరియు సాంకేతిక నిపుణులు భాగస్వామ్య సాంస్కృతిక లక్ష్యాన్ని సాధించడంలో సహకరిస్తారని పేర్కొన్నారు. ఖతార్ నేషనల్ విజన్ 2030లో వివరించిన విధంగా వైవిధ్యభరితమైన జ్ఞాన-ఆధారిత ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి ప్రయత్నాలను బలోపేతం చేస్తుందన్నారు.
లిటిల్ ఎంప్లాయీ కుటుంబంలో చేరినందుకు, ప్రారంభ కెరీర్ అభివృద్ధిని ప్రోత్సహించినందుకు ఖతార్ మ్యూజియమ్స్ కు QCDC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాద్ అబ్దుల్లా అల్-ఖార్జీ కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు







