OTTలో దూసుకుపోతున్న మా మూవీ
- August 31, 2025
ఇటీవల కాలంలో ఓటీటీల్లో హారర్ సినిమాల కోసం ప్రేక్షకులు ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. భయానక వాతావరణం, ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి.ఈ క్రమంలో తాజాగా విడుదలైన ఒక హారర్ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ టాప్ 10 ట్రెండింగ్ జాబితాలోకి దూసుకుపోయింది.
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ ప్రధాన పాత్రలో నటించిన మా సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. ఈ చిత్రంలో ఆమె అంబిక అనే తల్లి పాత్రలో కనిపించారు. భర్త మరణం తర్వాత తన టీనేజ్ కుమార్తెతో కలిసి నగరంలో జీవనం సాగించే అంబిక, కొన్ని పరిస్థితుల కారణంగా తన పూర్వీకుల గ్రామానికి వెళ్లి అక్కడి పాత ఇంటిని అమ్ముకోవాల్సి వస్తుంది. కానీ ఆ ఇంటికి వెళ్లిన తర్వాత వారి జీవితంలో ఊహించని ప్రమాదాలు మొదలవుతాయి.
ఆ గ్రామంలో చాలా కాలంగా యువతులు రహస్యంగా అదృశ్యం అవుతూ ఉండటం, చంపబడటం వంటి సంఘటనలు జరుగుతాయి. ప్రజలు ఈ ఘటనల వెనుక ఒక దుష్టశక్తి ఉందని నమ్ముతారు. అంబిక కుమార్తె ఒక వింత వ్యాధితో బాధపడుతుండటంతో ఆ దుష్టశక్తి ఆమెను లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ పరిస్థితుల్లో తన కుమార్తెను రక్షించుకోవడానికి అంబిక దుష్టశక్తితో భీకరమైన పోరాటానికి దిగుతుంది.
అంబిక తన పూర్వీకుల ఇంటిలో కొన్ని పాత పుస్తకాలు, టాల గుర్తులు కనుగొంటుంది. వీటివల్ల తమ కుటుంబానికి ఒకప్పుడు దుష్టశక్తులను నియంత్రించే ప్రత్యేక శక్తి ఉందని తెలుసుకుంటుంది. ఆ రహస్యాలను ఆధారంగా చేసుకుని అంబిక తన కుమార్తెను మాత్రమే కాకుండా గ్రామ ప్రజలనే రక్షించడానికి ప్రయత్నిస్తుంది.
133 నిమిషాల నిడివి గల ఈ హారర్ సినిమా ఆద్యంతం ఉత్కంఠను కలిగిస్తూ ప్రేక్షకులను రెప్పవేయనీయదు. ప్రతి సన్నివేశం భయాన్ని, ఆసక్తిని కలిగించేలా తెరకెక్కింది. క్లైమాక్స్లో జరిగే మలుపులు ప్రేక్షకులను సీటు ఎడ్జ్కి నెట్టేస్తాయి.
ఈ చిత్రానికి విశాల్ ఫురియా దర్శకత్వం వహించగా, కాజోల్తో పాటు రోనిత్ రాయ్, గోపాల్ సింగ్, ఇంద్రనీల్ సేన్గుప్తా కీలక పాత్రల్లో నటించారు. శక్తివంతమైన కథ, కాజోల్ ప్రదర్శన, భయపెట్టే నేపథ్య సంగీతం కలిసి ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







