దుబాయ్ ఎయిర్ పోర్టులో కొత్త చెకింగ్ టెక్నాలజీ..!!
- September 04, 2025
యూఏఈ: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB)లో ప్రయాణికులు ఇక తమ ల్యాప్ టాప్ లు బ్యాగు నుంచి తీయాల్సి పనిలేదు. వాటర్ బాటిల్స్ పడేయాల్సిన అవసరం ఉండదు. ఇవేవి లేకుండానే ఎంచక్కా సెక్యూరిటీ చెకింగ్ ను పూర్తి చేయవచ్చు.
ఇప్పటికే ఉన్న హ్యాండ్ బ్యాగేజ్ మరియు హోల్డ్ బ్యాగేజ్ సెక్యూరిటీ స్క్రీనింగ్ వ్యవస్థలను దశలవారీగా తొలగిస్తున్నట్లు దుబాయ్ విమానాశ్రయాల టెర్మినల్ కార్యకలాపాల సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎస్సా అల్ షంసి తెలిపారు. దీని స్థానంలో కొత్త బ్యాగేజీ చెకింగ్ టెక్నాలజీ 2026 చివరి వరకు అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ కొత్త టెక్నాలజీ మీ బ్యాగ్ నుండి ఏమీ తీయవలసిన అవసరం లేకుండానే సెక్యూరిటీని పూర్తి చేసేందుకు అవకాశం కల్పిస్తుందన్నారు.
ప్రస్తుతం సెక్యూరిటీ చెకింగ్ సమయంలో ప్రయాణీకులు ల్యాప్టాప్లు, పెర్ఫ్యూమ్లు, క్రీమ్లు మరియు 100ml కంటే ఎక్కువ లిక్విడ్స్ ఉన్న వస్తువులను స్కానింగ్ చేసే కొత్త ఏఐ స్కానర్లను పరీక్షిస్తున్నట్లు తెలిపారు. 2025 మొదటి 6 నెలల్లో ఎయిర్ పోర్టు 46 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందించిందని, ఏటా ప్రయాణికుల సంఖ్య 2.3 శాతం పెరుగుతుందని అల్ షంసి వివరించారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







