ఆగస్టు 15 నుంచి వారం రోజుల పాటు 'తిరంగా ఉత్సవాలు'

- July 19, 2016 , by Maagulf
ఆగస్టు 15 నుంచి వారం రోజుల పాటు 'తిరంగా ఉత్సవాలు'

 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆగస్టు 15 నుంచి వారం రోజుల పాటు 'తిరంగా ఉత్సవాలు' నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా బీజేపీ ఎంపీలందరూ తమ నియోజకవర్గాల్లో తిరంగా ఉత్సవాలు జరపాలని కోరారు. ఎంపీలందరూ పాల్గొని 70 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరపాలన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేసేందుకు నియోజకవర్గాల వారీ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. దేశభక్తి, దేశ నాయకుల జీవితగాథలను నేటి యువతకు చేరువ చేయాలన్నారు. 70 రకాల స్లైడ్స్ తయారు చేసి 70 ఏళ్ల స్వాతంత్య్రంపై ప్రజలకు వివరించాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com