మెక్డోనాల్డ్స్ యాక్సిడెంట్: బాధితుల ఆవేదన
- July 19, 2016
అజ్మన్లోని మెక్డోనాల్డ్స్ ఔట్లెట్లో జరిగిన యాక్సిడెంట్లో మృతిచెందినవారి కుటుంబీకుల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. ఈ ప్రమాదంలో భారతదేశానికి చెందిన 45 ఏళ్ళ మహిల, మరో చిన్నారి మృతి చెందారు. మృతి చెందిన మహిళ మూడు రోజుల క్రితయే యూఏఈకి వచ్చినట్లు ఆమె సోదరుడు మొహమ్మద్ రఫి చెప్పారు. మృతురాలి మనవడు ఈ ప్రమాదంలో గాపడ్డాడనీ, అతనిప్పుడు ఆసుపత్రిలో ఉన్నాడని రఫి చెప్పారు. కుమార్తె, అల్లుడితో కలిసి ఆ సమయంలో మృతురాలు మెక్డోనాల్డ్స్కి వెళ్ళారని, అనూహ్యంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని రఫి కన్నీరు మున్నీరయ్యారు. 22 ఏళ్ళ ట్రక్ డ్రైవర్, ట్రక్పై కంట్రోల్ తప్పడంతో మెక్డోనాల్డ్స్లోకి దూసుకెళ్ళాడు ట్రక్తో సహా. సోషల్ మీడియాలో ఈ ఘటన పట్ల పలువురు స్పందించారు. మృతులకు ఘనంగా నివాళులర్పించారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







