దేశాభివృద్ధికి బూస్టర్ డోస్, ప్రజలకు దీపావళి గిఫ్ట్..!
- September 04, 2025
న్యూ ఢిల్లీ: జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని మోదీ స్పందించారు. ఇది దేశ ప్రజలకు దీపావళి గిఫ్ట్ గా అభివర్ణించారు. దీపావళికి ముందే ప్రజలకు ఆనందం వచ్చిందన్నారాయన. ప్రజలకు అనుకూలంగా వెళ్లడమే మా ప్రభుత్వ విధానం అని ఆయన స్పష్టం చేశారు. జీఎస్టీ సంస్కరణలతో పౌరుల జీవన నాణ్యత మెరుగుపడుతుందన్నారు. వినియోగం, వృద్ధికి కొత్త బూస్టర్ డోస్ లభిస్తుందని ఆకాంక్షించారు. కొత్త సంస్కరణలతో ఆత్మనిర్భర్ భారత్ మరింత ముందే సాకారం అవుతుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
‘మేడిన్ ఇండియాపై అందరూ ఆలోచించాలి. గాంధీజీ ఇచ్చిన స్వదేశీ నినాదం అందరం పాటిద్దాం. స్వదేశీ విధానంతోనే మరింత స్వావలంబన సాధించగలం. హెయిర్ పిన్నులు కూడా విదేశాల నుంచి తెచ్చుకునే విధానం మారాలి. స్వదేశీ వస్తు వినియోగం, మేడిన్ ఇండియాను విద్యార్థి దశ నుంచే అలవాటు చేయాలి. మన దేశంలో తయారు చేసిన వస్తువులనే వాడాలి.
దేశీయ ఉత్పత్తులు వాడేందుకు గర్వపడాలి. మేడిన్ ఇండియాపై చిన్న, పెద్ద అందరూ ఆలోచించాలి. దేశీయ ఉత్పత్తుల వినియోగంతో దేశ రూపురేఖలు మారిపోతాయి. స్వదేశీ డే స్వదేశీ వీక్ ను పండుగగా నిర్వహించుకోవాలి.దేశీయ ఉత్పత్తిదారులను మనమే గౌరవించాలి, ఆదరించాలి. దేశభక్తి, ఆత్మగౌరవం, స్వయం సమృద్ధితో దేశాన్ని ముందుకు నడిపిద్దాం” అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







