బహ్రెయిన్లో యువ ప్రతిభకు పట్టం..!!
- September 08, 2025
మనామా: బహ్రెయిన్ లో యూత్ ఇన్నోవేషన్ మరియు ఎక్సలెన్స్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు వర్క్స్ మంత్రిత్వ శాఖను యువజన వ్యవహారాల ప్రతినిధి షేక్ నాజర్ బిన్ హమద్ అల్ ఖలీఫా ప్రశంసించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో యువతను ప్రోత్సహించడానికి హిస్ హైనెస్ జారీ చేసిన వ్యూహాత్మక ప్రణాళికకు అనుగుణంగా ఈ కమిటీ ఏర్పాటు ఒక కీలక ముందడుగా ఆయన అభివర్ణించారు.
యువ ప్రతిభను ఉపయోగించుకోవడానికి, వారికి పని వాతావరణాన్ని మెరుగుపరచడంలో మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాలను హిస్ హైనెస్ ప్రశంసించారు. యువ నిపుణులను సాధికారత కల్పించే జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించాలని సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టుల ద్వారా యువతలో వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించడానికి కమిటీ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









