ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- January 18, 2026
దోహా: ఖతార్ లో విద్య మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE) ప్రారంభించిన “ప్రైవేట్ స్కూల్స్ మరియు కిండర్ గార్టెన్ల కమ్యూనిటీ బాధ్యత” ప్రాజెక్ట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చొరవ కింద 46 ప్రైవేట్ స్కూల్స్, కిండర్ గార్డెన్స్ ముందుకొచ్చాయి. దాదాపు 4వేల మందికిపైగా విద్యార్థులకు ఫ్రీ మరియు రాయితీ సీట్లను అందించనున్నట్లు ప్రకటించాయి.
విద్య మరియు ఉన్నత విద్యా మంత్రి హెచ్ ఇ లోల్వా బింట్ రషీద్ బిన్ మొహమ్మద్ అల్ ఖాటర్.. ఈ ప్రాజెక్టుకు సహకారం అందించిన ప్రైవేట్ స్కూల్స్ ప్రతినిధులను సత్కరించారు. విద్యా మంత్రిత్వ శాఖ ప్రకారం, పదేళ్లలో ఉచిత సీట్ల అంచనా విలువ QR18.6 బిలియన్ (QR18,638,023,000) కంటే ఎక్కువగా ఉంటుందని, ఇది మెరగైన విద్యా వ్యవస్థకు ప్రైవేట్ స్కూళ్ల మద్దతును హైలైట్ చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో విద్య మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ హెచ్ ఇ డాక్టర్ ఇబ్రహీం బిన్ సలేహ్ అల్ నుయిమి, అసిస్టెంట్ అండర్ సెక్రటరీలు, లైసెన్స్ హోల్డర్లు మరియు ప్రైవేట్ పాఠశాలలు మరియు కిండర్ గార్టెన్ల డైరెక్టర్లతో పాటు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







