బోనాలను శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు..
- July 19, 2016
బోనాల కోసం నగరంలోని వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు రూ.7కోట్లు వ్యయం చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్రెడ్డి తెలిపారు. బోనాల ఉత్సవాల నిర్వహణపై సమీక్షలో జీహెచ్ఎంసీ కమిషనర్తో పాటు సీపీ మహేందర్రెడ్డి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. బోనాల సందర్భంగా అదనంగా 500మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తారని, ఆరు మొబైల్ మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఆగస్టు 1 నుంచి ప్లాస్టిక్పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు.
బోనాలను శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ మహేందర్రెడ్డి తెలిపారు. ఇతర శాఖలతో పోలీసుశాఖ సమన్వయంతో పనిచేస్తుందన్నారు.బోనాల వూరేగింపు మార్గాల్లో 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. మహిళల రక్షణకు షీ బృందాలు, గొలుసు దొంగతనాల వ్యతిరేక బృందాలను నియమిస్తామన్నారు. బోనాల కోసం 3వేల మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను ప్రజలు నమ్మొద్దని.. ఏవైనా అనుమానాలు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అన్ని వర్గాలు పోలీసులకు సహకరించి బోనాలు శాంతియుతంగా జరిగేలా చూడాలని కమిషనర్ కోరారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







