ఖతార్ పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన గల్ఫ్ దేశాలు..!!
- September 10, 2025
యూఏఈః దోహాలో హమాస్ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులకు తెగబడటాన్ని గల్ఫ్ దేశాలు ముక్త కంఠంతో ఖండించాయి. ఇది ఖతార్ రాష్ట్ర సార్వభౌమత్వాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమేనని పేర్కొన్నాయి. అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్యసమితి చార్టర్పై జరిగిన దాడిగా అభిర్ణించాయి.
సౌదీ అరేబియా ఇజ్రాయెల్ వి దురాక్రమణ చర్యగా పేర్కొంది. ఖతార్ తీసుకునే అన్ని చర్యలకు పూర్తి మద్దతు ఇస్తామని తెలిపింది. ఖతార్ సార్వభౌమత్వంపై జరిగిన దాడిగా ఒమన్ తెలిపింది.
ఇజ్రాయెల్ దాడులు అంతర్జాతీయ శాంతిని నేరుగా దెబ్బతీస్తాయని, ఈ ప్రాంతంలో సార్వభౌమత్వాన్ని గౌరవించాలని కువైట్ పేర్కొంది. ఇజ్రాయెల్ ది పిరికి చర్యగా పేర్కొన్న జోర్డాన్..దాడులను తప్పుబట్టింది. ఖతార్ కు అండగా ఉంటామని, తదుపరి తీసుకునే చర్యలకు ఒకటి నిలిచి మద్దతు ఇస్తామని గల్ఫ్ సహకార మండలి సభ్య దేశాలు తేల్చిచెప్పాయి.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









