భారతీయులకు వీసాలు ఇవ్వొద్దు: చార్లీ కిర్క్
- September 11, 2025
అమెరికా: అమెరికాకు చెందిన కన్జర్వేటివ్ నాయకుడు చార్లీ కిర్క్ ఉటాలో జరిగిన దాడిలో దుర్మరణం చెందారు. కిర్క్ ఉటా వ్యాలీ యూనివర్శిటీ,కార్యక్రమంలో మాట్లాడుతుండగా, ఓ దుండగుడు ఆయనపై కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో చార్లీ కిర్క్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనేఆయన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. ఈ మేరకు కిర్క్ చనిపోయినట్లు ట్రంప్ ధ్రువీకరించారు.
అయితే ఈ హత్యకు వారం రోజుల ముందే కిర్క్ భారతీయులకు వీసాల విషయంలో చేసిన కామెంట్లు తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా వలసలు, ఔట్సోర్సింగ్ వల్ల అమెరికన్లకు ఉద్యోగాలు తగ్గిపోతున్నాయని ఆయన ఆరోపించారు. భారతీయులకు వీసా (Visa) లు ఇవ్వడం ఆపేయాలని కూడా డిమాండ్ చేశారు. కిర్క్ మరణం తర్వాత ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక చాలు. మనదేశం నిండిపోయింది. మన ప్రజలకే ప్రాధాన్యత ఇద్దాం’ అని కిర్క్ కామెంట్లు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కు ముఖ్య సహాయకుడిగా ఉన్న 32 ఏళ్ల కిర్క్ సెప్టెంబర్ 2న ‘అమెరికా ఫస్ట్’ అనే చర్చల్లో పాల్గొన్నారు.
ఇందులో భాగంగానే అమెరికా,భారతీయులకు వీసాలు ఇవ్వడం ఆపేయాలని ఆయన గట్టిగా వాదించారు. ఎక్స్ వేదికగా పోస్టు పెడుతూ ‘అన్ని దేశాల వలస కార్మికుల కంటే కూడా భారతీయుల వల్లే అమెరికన్లకు పెద్దగా ఉద్యోగావకాశాలు ఉండడం లేదని ఆరోపించారు.
అమెరికా భారతీయులకు మరింత వీసాలు ఇవ్వాల్సి వస్తుందని ఫాక్స్ న్యూస్ యాంకర్ చేసిన ఎక్స్ పోస్టుపై కిర్క్ ఈ విధంగా స్పందించారు. ఈఘటనకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. వాటిలో కిర్క్ కుర్చీలో నుంచి పడిపోతూ
తన మెడను పట్టుకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







