నేపాల్: మళ్లీ కోలుకోవడం కష్టమే!
- September 11, 2025
నేపాల్ యువత తిరుగుబాటు చేసింది. కఠ్మాండూలో అరాచకం జరిగింది. అది చిన్న అరాచకం కాదు. వాళ్లూ.. వీళ్లూ అనే తేడా లేకుండా… రాజకీయ నేతలందరిపై దాడులు చేశారు. ఓ మాజీ ప్రధాని భార్యను సజీవదహనం చేశారు. తమ దేశ ప్రజాస్వామ్య చిహ్నమైన పార్లమెంట్ ను కూడా వదిలిపెట్టలేదు. ఇళ్లను, పార్లమెంట్ ను.. తగులబెట్టేశారు. ఇది నేపాల్ చరిత్రలోనే అత్యంత ఘోరమైన తిరుగుబాటు విధ్వంసం.
అందరూ వైదొలిగిన తర్వాత కూడా హింస!
ప్రజా తిరుగుబాటు తీవ్రమైందని తెలుసుకున్న తర్వాత పాలకులందరూ పదవుల నుంచి దిగిపోయారు. అన్నీ ఖాళీ చేసి పారిపోయారు. వారిని కాపాడేందుకు ఆర్మీ తంటాలు పడింది. కనిపిస్తే వారిలో చాలా మందిని చంపేసి ఉండేవారు. ఆర్మీ హెలికాఫ్టర్లు తాళ్లు విసిరితే..ఆ తాళ్లు పట్టుకుని పారిపోయిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. ప్రభుత్వాలు కుప్పకూలిన తర్వాత చేసే అరాచకం ఏదైనా ఆ దేశానికే నష్టం తెస్తుంది. నేపాల్ లో అదే జరుగుతోంది.
అసలే పేద దేశం.. మొత్తం విధ్వంసం!
నేపాల్ అసలే పేద దేశం. తినే ఆహారం కోసం కూడా దిగుమతులపైనే ఆధారపడాలి. పర్యాటకంపై ఎక్కువ ఆధారపడి ఉంటారు. అలాంటి దేశంలో యువత తిరుగుబాటు అనేది..తమ దేశానికి.. తమకు దీర్ఘకాలికంగా నష్టం లేకుండా చేసుకోవాలి. కానీ నేపాల్ యువత అరాచకానికే మొగ్గు చూపారు. తమ దేశ మౌలిక సదుపాయాల్ని ద్వంసం చేసుకున్నారు. పార్లమెంట్ ను ధ్వంసం చేసుకుని వారు సాధించేదేమిటో. వారికే తెలియాలి. ఇప్పుడు ఇతర దేశాలు నేపాల్ యువత చేసిన విధ్వంసాన్ని భర్తీ చేయవు. మళ్లీ అక్కడి ప్రజలే వాటిని తమ డబ్బులతో నిర్మించుకోవాలి.
ఆర్మీ కాల్పులతోనే అసలు సమస్య
అవినీతి, ఇతర ప్రభుత్వ వ్యవహారాలపై అసంతృప్తి సహజంగానే ఉంటుంది. కానీ సోషల్ మీడియాను బ్యాన్ చేయడంతో ప్రజలు రగిలిపోయారు. వారిని కట్టడి చేయడానికి బెదిరించాలనుకున్నారు. అది కాల్పులకు దారి తీయడంతో చివరికి పూర్తిగా పరిస్థితి విషమించింది. ఇప్పుడు ఆ దేశానికి జరిగిన నష్టం ఆస్తుల రూపంలోనే కాదు.. అనేక విధాలుగా ఉంటుంది. పర్యాటకులు కూడా వెళ్లరు. అప్పుడు అక్కడి యువత మరిన్ని ఇబ్బందులు పడుతుంది. ప్రజలకు ఆదాయం లేకుండా పోతుంది. ఆ నష్టం భర్తీ చేసేదారులు ఉండవు. మొత్తంగా నేపాల్ కోలుకోవడం ఇప్పుడల్లా సాధ్యమయ్యే విషయం కాదని అంతర్జాతీయ నిపుణుల అంచనా.
తాజా వార్తలు
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!







