నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ సింగ్ ఎంపిక
- September 11, 2025
నేపాల్: ఎట్టకేలకు నేపాల్ లో రాజకీయ అనిశ్చితికి తెరదించింది. నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ ఘీసింగ్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఆయన పేరును జెన్-జెడ్ ప్రతిపాదించగా.. అన్ని వర్గాల నుంచి ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. కుల్మన్ గతంలో నేపాల్ విద్యుత్ బోర్డు కు ఎండీగా పనిచేశారు. ఆయన నియామకంపై తుదినిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియాపై నిషేధం,విధించడంతో నేపాల్ లో అల్లర్లు చెలరేగిన సంగతి విధితమే. యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. ఈఆందోళన కాస్త హింసాత్మకగా మారింది. దేశ ప్రధాని, పార్లమెంట్, ఇతర మంత్రుల నివాసలకు నిప్పు పెట్టారు. మంత్రులపైభౌతిక దాడులకు పాల్పడ్డారు. దీంతో పాలకులు తమ ప్రాణాలను దక్కించుకునేందుకు ఇతర దేశాలకు పారిపోయారు.
సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్ పై నిషేధం విధించడంలో నేపాల్ లో జెన్ జెడ్ ఉద్యమం (Nepal’s Gen Z movement) ఆరంభమైంది. దీనితోపాటు ప్రభుత్వ,పెద్దల అవినీతి, అక్రమాలపై యువత ఉద్యమించింది. పలుచోట్ల ఆందోళనకారులు ప్రబుత్వ ఆస్తులకు నష్టం చేయడంతో ఉద్యమం హింసాత్మకంగా మారింది. దీంతో సైన్యం రంగంలోకి దిగింది. ఆందోళనల నేపథ్యంలో ప్రధాని కేపీ శర్మ ఓలితో సహాపలువురు మంత్రులు, దేశ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ సైతం తమ పదవులకు రాజీనామాలు చేశారు. దీంతో అందరి,ఆమోదయోగ్యుడైన కుల్మన్ సింగ్ కు దేశ నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. దేశంలో విద్యుత్ కోతలకు చరమగీతం పాడిన,వ్యక్తిగా, అవినీతి మరకలేని స్వచ్ఛమైన నేతగా ఆయనకు మంచి పేరుంది.
తాజా వార్తలు
- విజయ్కు లైన్క్లియర్.. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి..
- సీజనల్ అలెర్జీలు.. అవగాహన, నివారణ, చికిత్స పై నిపుణుల సూచనలు..!!
- 2025లో యూఏఈలో 5,58,000 కొత్త డ్రైవర్లు..!!
- వీసా మినహాయింపు ఒప్పందం పై సంతకం చేసిన సౌదీ, టర్కీ..!
- భద్రతా సంబంధాలను బలోపేతానికి యూకే, బహ్రెయిన్ చర్చలు..!!
- ఇరాన్ ప్రకటనను ఖండించిన యూఏఈ..!!
- ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతపై ఒమన్, నార్వే చర్చలు..!!
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2ని ఆమోదించండి అంటూ కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్
- పంజాబ్ పై హైదరాబాద్ ఘన విజయం !!
- చివరి నిమిషంలో విజయ్ ప్రమాణ స్వీకారం రద్దు!









