ఇరాన్‌ పై దాడుల నిర్ణయంతో ట్రంప్‌ పై అమెరికాలో రాజకీయ వివాదం

- March 02, 2026 , by Maagulf
ఇరాన్‌ పై దాడుల నిర్ణయంతో ట్రంప్‌ పై అమెరికాలో రాజకీయ వివాదం

అమెరికా: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న సైనిక చర్యల నిర్ణయం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులను మరింత తీవ్రమయ్యేలా చేసింది.ఇరాన్‌లో పాలన మార్పు లక్ష్యంగా అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడులు జరిపినట్లు సమాచారం.ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీయి సహా పలువురు ఉన్నతాధికారులు మరణించినట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి.దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ ప్రతీకార దాడులు ప్రారంభించడంతో ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ దాడుల్లో అమెరికా సైనికులు మరణించినట్లు కూడా సమాచారం వెలువడుతోంది.

టెహ్రాన్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడులపై అమెరికా లోపల రాజకీయ వివాదం చెలరేగింది. కాంగ్రెస్ అనుమతి లేకుండా సైనిక చర్యలకు ఆదేశాలు ఇవ్వడంపై డెమోక్రాట్లు మాత్రమే కాకుండా కొందరు రిపబ్లికన్ నేతలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. యుద్ధానికి అనుమతి ఇవ్వాల్సిన అధికారం కాంగ్రెస్‌కే ఉందని వారు వాదిస్తున్నారు.

డెమోక్రాట్ నేత రో ఖన్నా ఈ చర్యను రాజ్యాంగ విరుద్ధమని విమర్శించగా, రిపబ్లికన్ నేతలు థామస్ మస్సి మరియు రాండ్ పాల్ కూడా యుద్ధ నిర్ణయంపై సందేహాలు వ్యక్తం చేశారు. అయితే హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ మరియు సెనేట్ మెజారిటీ నాయకుడు జాన్  తూనే అధ్యక్షుడి చర్యను సమర్థిస్తూ, ఆయనకు రాజ్యాంగబద్ధ అధికారాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ను అత్యవసరంగా సమావేశపరచాలని, సైనిక చర్యపై ఓటింగ్ నిర్వహించాలని సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇరాన్ తన ప్రతిదాడులను ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ ప్రాంతాలపై విస్తరించడంతో మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com