అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- September 24, 2025
దుబాయ్: మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ సమీపంలోని అల్ బర్షా ప్రాంతంలోని 14 అంతస్తుల నివాస భవనంలో మంగళవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న దుబాయ్ సివిల్ డిఫెన్స్ ఆరు నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. నివాసితులను సురక్షితంగా ఖాళీ చేయించినట్లు పేర్కొన్నారు.
కాగా, దుబాయ్ సివిల్ డిఫెన్స్ మంటలను అదుపు చేయడంలో సహాయపడటానికి దాని అధునాతన 'షాహీన్' డ్రోన్లను మోహరించింది. 200 మీటర్ల ఎత్తు వరకు ఉన్న ఎత్తైన ప్రదేశాల అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ డ్రోన్లు 1,200 లీటర్ల ట్యాంక్ను కలిగి ఉంటాయి. డ్రోన్లు అందించిన వైమానిక సహాయం అగ్నిమాపక సిబ్బంది మంటలను మరింత సమర్థవంతంగా అదుపు చేయడానికి , మంటలను వ్యాప్తి చెందకుండా తగ్గించిందని అధికారులు తెలిపారు.
అయితే, మొదటగా నాల్గవ అంతస్తు నుండి పొగ వెలువడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మధ్యాహ్నం 2.15 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగిందని తనకు ఫోన్ వచ్చిందని, పొరుగువారి సహాయంతో సురక్షితంగా కిందకు వచ్చినట్లు 10వ అంతస్తులో నివసిస్తున్న సహర్ తన అనుభవాన్ని తెలిపాడు.
కాగా, ఇదే ప్రాంతంలో ఇటీవలి నెలల్లో పలు అగ్ని ప్రమాదాలు జరిగాయి. మే 13న గ్యాస్ లీక్ కావడంతో సమీపంలోని 13 అంతస్తుల అల్ జరూని భవనంలో మంటలు చెలరేగాయి.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









