అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- September 24, 2025
దుబాయ్: మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ సమీపంలోని అల్ బర్షా ప్రాంతంలోని 14 అంతస్తుల నివాస భవనంలో మంగళవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న దుబాయ్ సివిల్ డిఫెన్స్ ఆరు నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. నివాసితులను సురక్షితంగా ఖాళీ చేయించినట్లు పేర్కొన్నారు.
కాగా, దుబాయ్ సివిల్ డిఫెన్స్ మంటలను అదుపు చేయడంలో సహాయపడటానికి దాని అధునాతన 'షాహీన్' డ్రోన్లను మోహరించింది. 200 మీటర్ల ఎత్తు వరకు ఉన్న ఎత్తైన ప్రదేశాల అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ డ్రోన్లు 1,200 లీటర్ల ట్యాంక్ను కలిగి ఉంటాయి. డ్రోన్లు అందించిన వైమానిక సహాయం అగ్నిమాపక సిబ్బంది మంటలను మరింత సమర్థవంతంగా అదుపు చేయడానికి , మంటలను వ్యాప్తి చెందకుండా తగ్గించిందని అధికారులు తెలిపారు.
అయితే, మొదటగా నాల్గవ అంతస్తు నుండి పొగ వెలువడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మధ్యాహ్నం 2.15 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగిందని తనకు ఫోన్ వచ్చిందని, పొరుగువారి సహాయంతో సురక్షితంగా కిందకు వచ్చినట్లు 10వ అంతస్తులో నివసిస్తున్న సహర్ తన అనుభవాన్ని తెలిపాడు.
కాగా, ఇదే ప్రాంతంలో ఇటీవలి నెలల్లో పలు అగ్ని ప్రమాదాలు జరిగాయి. మే 13న గ్యాస్ లీక్ కావడంతో సమీపంలోని 13 అంతస్తుల అల్ జరూని భవనంలో మంటలు చెలరేగాయి.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







