మిష్రెఫ్ ఫెయిర్గ్రౌండ్లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- September 24, 2025
కువైట్: ఆటో ల్యాండ్ ఎగ్జిబిషన్ కువైట్లో అతిపెద్ద కార్ షో గా గుర్తింపు పొందింది. ఇది సెప్టెంబర్ 22 న మిష్రెఫ్లోని కువైట్ ఇంటర్నేషనల్ ఫెయిర్గ్రౌండ్లో అధికారికంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు దౌత్యవేత్తలు, సీనియర్ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో సందర్శకులు పాల్గొన్నారు.
సెప్టెంబర్ 27 వరకు జరిగే ఈ ప్రదర్శన హాల్స్ 5, 6, 7 మరియు 8లో ప్రతిరోజూ ఉదయం 10:00 నుండి రాత్రి 10:00 గంటల వరకు జరుగుతోంది. తాజా మోడల్లు, యాక్సెసరీలు మరియు ఆటోమోటివ్ హిస్టరీని ఒకే వేదికపై చూడవచ్చు. ఆటో పరిశ్రమలో అత్యాధునిక సాంకేతికతతో పాటు లగ్జరీ మరియు స్పోర్ట్స్ కార్ల నుండి ఫ్యామిలీ మోడల్ల వరకు విస్తృత శ్రేణి వాహనాలను చూసే అవకాశం కల్పించారు.
ఈ సందర్భంగా కస్టమర్లకు ప్రత్యేకమైన ప్రమోషన్లు మరియు డిస్కౌంట్లను కార్ల కంపెనీలు అందిస్తున్నాయి. అంతర్జాతీయ బ్రాండ్లు తమ తాజా ఆవిష్కరణలను కువైట్ మార్కెట్కు పరిచయం చేయడానికి ఈ ప్రదర్శన ఒక వేదికగా కూడా పనిచేస్తుందని అధికార యంత్రాంగం వెల్లడించింది.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









