మిష్రెఫ్ ఫెయిర్గ్రౌండ్లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- September 24, 2025
కువైట్: ఆటో ల్యాండ్ ఎగ్జిబిషన్ కువైట్లో అతిపెద్ద కార్ షో గా గుర్తింపు పొందింది. ఇది సెప్టెంబర్ 22 న మిష్రెఫ్లోని కువైట్ ఇంటర్నేషనల్ ఫెయిర్గ్రౌండ్లో అధికారికంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు దౌత్యవేత్తలు, సీనియర్ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో సందర్శకులు పాల్గొన్నారు.
సెప్టెంబర్ 27 వరకు జరిగే ఈ ప్రదర్శన హాల్స్ 5, 6, 7 మరియు 8లో ప్రతిరోజూ ఉదయం 10:00 నుండి రాత్రి 10:00 గంటల వరకు జరుగుతోంది. తాజా మోడల్లు, యాక్సెసరీలు మరియు ఆటోమోటివ్ హిస్టరీని ఒకే వేదికపై చూడవచ్చు. ఆటో పరిశ్రమలో అత్యాధునిక సాంకేతికతతో పాటు లగ్జరీ మరియు స్పోర్ట్స్ కార్ల నుండి ఫ్యామిలీ మోడల్ల వరకు విస్తృత శ్రేణి వాహనాలను చూసే అవకాశం కల్పించారు.
ఈ సందర్భంగా కస్టమర్లకు ప్రత్యేకమైన ప్రమోషన్లు మరియు డిస్కౌంట్లను కార్ల కంపెనీలు అందిస్తున్నాయి. అంతర్జాతీయ బ్రాండ్లు తమ తాజా ఆవిష్కరణలను కువైట్ మార్కెట్కు పరిచయం చేయడానికి ఈ ప్రదర్శన ఒక వేదికగా కూడా పనిచేస్తుందని అధికార యంత్రాంగం వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







