మిష్రెఫ్ ఫెయిర్గ్రౌండ్లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- September 24, 2025
కువైట్: ఆటో ల్యాండ్ ఎగ్జిబిషన్ కువైట్లో అతిపెద్ద కార్ షో గా గుర్తింపు పొందింది. ఇది సెప్టెంబర్ 22 న మిష్రెఫ్లోని కువైట్ ఇంటర్నేషనల్ ఫెయిర్గ్రౌండ్లో అధికారికంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు దౌత్యవేత్తలు, సీనియర్ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో సందర్శకులు పాల్గొన్నారు.
సెప్టెంబర్ 27 వరకు జరిగే ఈ ప్రదర్శన హాల్స్ 5, 6, 7 మరియు 8లో ప్రతిరోజూ ఉదయం 10:00 నుండి రాత్రి 10:00 గంటల వరకు జరుగుతోంది. తాజా మోడల్లు, యాక్సెసరీలు మరియు ఆటోమోటివ్ హిస్టరీని ఒకే వేదికపై చూడవచ్చు. ఆటో పరిశ్రమలో అత్యాధునిక సాంకేతికతతో పాటు లగ్జరీ మరియు స్పోర్ట్స్ కార్ల నుండి ఫ్యామిలీ మోడల్ల వరకు విస్తృత శ్రేణి వాహనాలను చూసే అవకాశం కల్పించారు.
ఈ సందర్భంగా కస్టమర్లకు ప్రత్యేకమైన ప్రమోషన్లు మరియు డిస్కౌంట్లను కార్ల కంపెనీలు అందిస్తున్నాయి. అంతర్జాతీయ బ్రాండ్లు తమ తాజా ఆవిష్కరణలను కువైట్ మార్కెట్కు పరిచయం చేయడానికి ఈ ప్రదర్శన ఒక వేదికగా కూడా పనిచేస్తుందని అధికార యంత్రాంగం వెల్లడించింది.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









