మిష్రెఫ్ ఫెయిర్గ్రౌండ్లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- September 24, 2025
కువైట్: ఆటో ల్యాండ్ ఎగ్జిబిషన్ కువైట్లో అతిపెద్ద కార్ షో గా గుర్తింపు పొందింది. ఇది సెప్టెంబర్ 22 న మిష్రెఫ్లోని కువైట్ ఇంటర్నేషనల్ ఫెయిర్గ్రౌండ్లో అధికారికంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు దౌత్యవేత్తలు, సీనియర్ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో సందర్శకులు పాల్గొన్నారు.
సెప్టెంబర్ 27 వరకు జరిగే ఈ ప్రదర్శన హాల్స్ 5, 6, 7 మరియు 8లో ప్రతిరోజూ ఉదయం 10:00 నుండి రాత్రి 10:00 గంటల వరకు జరుగుతోంది. తాజా మోడల్లు, యాక్సెసరీలు మరియు ఆటోమోటివ్ హిస్టరీని ఒకే వేదికపై చూడవచ్చు. ఆటో పరిశ్రమలో అత్యాధునిక సాంకేతికతతో పాటు లగ్జరీ మరియు స్పోర్ట్స్ కార్ల నుండి ఫ్యామిలీ మోడల్ల వరకు విస్తృత శ్రేణి వాహనాలను చూసే అవకాశం కల్పించారు.
ఈ సందర్భంగా కస్టమర్లకు ప్రత్యేకమైన ప్రమోషన్లు మరియు డిస్కౌంట్లను కార్ల కంపెనీలు అందిస్తున్నాయి. అంతర్జాతీయ బ్రాండ్లు తమ తాజా ఆవిష్కరణలను కువైట్ మార్కెట్కు పరిచయం చేయడానికి ఈ ప్రదర్శన ఒక వేదికగా కూడా పనిచేస్తుందని అధికార యంత్రాంగం వెల్లడించింది.
తాజా వార్తలు
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- UAEU Concludes Participation in the Arab Media Summit 2026
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!







