కువైటీ చైల్డ్ మర్డర్ కేసు.. డొమెస్టిక్ వర్కర్ కు మరణశిక్ష..!!
- September 25, 2025
కువైట్: కువైట్ లో సంచలనం సృష్టించిన కువైటీ చైల్డ్ మర్డర్ కేసులో క్రిమినల్ కోర్టు తుది తీర్పు వెలువరించింది. కౌన్సెలర్ ఖలీద్ అల్-ఒమారా నేతృత్వంలోని క్రిమినల్ కోర్టు కువైటీ పిల్లవాడిని వాషింగ్ మెషిన్ లోపల ఉంచి స్విచ్ ఆన్ చేసి హత్య చేసినందుకు ఫిలిప్పీన్స్ డొమెస్టిక్ వర్కర్ నేరస్థురాలిగా నిర్ధారిస్తూ.. మరణశిక్షను ఖరారు చేసింది.
డిసెంబర్ చివరలో సబా అల్-సలేం శివారులోని ఓ ఇంటిలో ఈ విషాద సంఘటన జరిగింది. అక్కడ తల్లిదండ్రులు తమ రెండేళ్ల కొడుకు వాషింగ్ మెషిన్ లోపల నిర్జీవంగా పడి ఉండగా గుర్తించారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే బాలుడు మరణించాడని డాక్టర్లు నిర్ధారించారు.
అయితే, వర్కర్ ఈ నేరాన్ని అంగీకరించలేదు. బాలుడు నీటి బకెట్ లో పడి చనిపోయి ఉండగా గమనించి, యజమానులకు తెలియజేసినట్లు పేర్కొంది. అయితే, పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆమె వాదనను ఖండించింది. ఆమెకు గరిష్ట శిక్ష విధించాలని కోర్టును కోరింది. ముందస్తు హత్యకు ప్లాన్ చేసిన అభియోగాలపై ఆమెను ఉరితీయాలని డిమాండ్ చేసింది. విచారణ అధికారుల నివేదికలు, సీసీ ఫుటేజీ, సాక్ష్యాలను పరిశీలించిన తర్వాత కోర్టు.. వర్కర్ కు మరణిశిక్ష విధిస్తూ తన తుది తీర్పును వెలువరించింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







