కువైటీ చైల్డ్ మర్డర్ కేసు.. డొమెస్టిక్ వర్కర్ కు మరణశిక్ష..!!
- September 25, 2025
కువైట్: కువైట్ లో సంచలనం సృష్టించిన కువైటీ చైల్డ్ మర్డర్ కేసులో క్రిమినల్ కోర్టు తుది తీర్పు వెలువరించింది. కౌన్సెలర్ ఖలీద్ అల్-ఒమారా నేతృత్వంలోని క్రిమినల్ కోర్టు కువైటీ పిల్లవాడిని వాషింగ్ మెషిన్ లోపల ఉంచి స్విచ్ ఆన్ చేసి హత్య చేసినందుకు ఫిలిప్పీన్స్ డొమెస్టిక్ వర్కర్ నేరస్థురాలిగా నిర్ధారిస్తూ.. మరణశిక్షను ఖరారు చేసింది.
డిసెంబర్ చివరలో సబా అల్-సలేం శివారులోని ఓ ఇంటిలో ఈ విషాద సంఘటన జరిగింది. అక్కడ తల్లిదండ్రులు తమ రెండేళ్ల కొడుకు వాషింగ్ మెషిన్ లోపల నిర్జీవంగా పడి ఉండగా గుర్తించారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే బాలుడు మరణించాడని డాక్టర్లు నిర్ధారించారు.
అయితే, వర్కర్ ఈ నేరాన్ని అంగీకరించలేదు. బాలుడు నీటి బకెట్ లో పడి చనిపోయి ఉండగా గమనించి, యజమానులకు తెలియజేసినట్లు పేర్కొంది. అయితే, పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆమె వాదనను ఖండించింది. ఆమెకు గరిష్ట శిక్ష విధించాలని కోర్టును కోరింది. ముందస్తు హత్యకు ప్లాన్ చేసిన అభియోగాలపై ఆమెను ఉరితీయాలని డిమాండ్ చేసింది. విచారణ అధికారుల నివేదికలు, సీసీ ఫుటేజీ, సాక్ష్యాలను పరిశీలించిన తర్వాత కోర్టు.. వర్కర్ కు మరణిశిక్ష విధిస్తూ తన తుది తీర్పును వెలువరించింది.
తాజా వార్తలు
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!







