పండగ సీజన్ లో ప్రత్యేక భీమా కల్పించిన ఫోన్ పే

- September 25, 2025 , by Maagulf
పండగ సీజన్ లో ప్రత్యేక భీమా కల్పించిన ఫోన్ పే

న్యూ ఢిల్లీ: దీపావళి వేళ, ఫోన్‌పే వినియోగదారుల కోసం ప్రత్యేక బీమా పథకం తిరిగి ప్రవేశపెట్టబడింది. ఈ బీమా కేవలం రూ. 11 ప్రీమియంతో కొనుగోలు చేయవచ్చు మరియు అత్యధికంగా రూ. 25,000 వరకు ప్రమాద కవరేజ్ అందిస్తుంది. పాలసీదారుడితో పాటు వారి జీవిత భాగస్వామి మరియు ఇద్దరు పిల్లలకు కూడా ఇది వర్తిస్తుంది. పండగ వేడుకలలో బాణసంచా ప్రమాదాల కారణంగా 24 గంటలకుపైగా ఆసుపత్రిలో చేరడం, డే-కేర్ చికిత్స లేదా ప్రమాదవశాత్తు మరణం వంటి పరిస్థితులను ఈ బీమా కవర్ చేస్తుంది. కుటుంబం మొత్తం ఒకే పాలసీ కింద రక్షణ పొందగలదు, ఇది ప్రధానంగా ప్రత్యేకత.

ఈ పాలసీ కొనుగోలు చేసిన నాటి నుంచి 11 రోజుల పాటు చెల్లుబాటులో ఉంటుంది. అక్టోబర్ 12 లేదా అంతకంటే ముందు పాలసీ తీసుకున్నవారికి ఆ రోజు నుంచే కవరేజీ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కొనుగోలు చేసినవారికి వారి కొన్న తేదీ నుండి 11 రోజుల పాటు రక్షణ లభిస్తుంది. Diwali వినియోగదారులు PhonePe యాప్‌లోని ‘ఇన్సూరెన్స్’ విభాగానికి వెళ్లి ‘ఫైర్‌క్రాకర్ఇ న్సూరెన్స్’ ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా, వివరాలు నమోదు చేసి, రూ. 11 చెల్లించడం ద్వారా ఈ పాలసీని సులభంగా కొనుగోలు చేసుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com