బహ్రెయిన్ లో అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందం..!!
- September 25, 2025
మనామా : అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందం బహ్రెయిన్ లో పర్యటిస్తుంది. వలస కార్మికుల రక్షణ కేంద్రంలో అమెరికా ప్రతినిధి బృందాన్ని బహ్రెయిన్ లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) స్వాగతించింది. కార్మికుల శ్రేయస్సుకు, అదే సమయంలో వారి హక్కులకు పరిరక్షణకు తీసుకుంటున్న చర్యల గురించి ప్రతినిధుల బృందానికి వివరించారు.
LMRA వ్యవస్థకు కనెక్ట్ అయిన ఆర్థిక సంస్థల ద్వారా అన్ని కార్మికుల జీతాలు ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లించబడుతున్నాయని, మెరుగైన వేతన రక్షణ వ్యవస్థ ముఖ్య కార్యక్రమాలలో ఇది ఒకటని తెలియజేశారు. వలస కార్మికుల రక్షణ కేంద్రం నేతృత్వంలో మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి బహ్రెయిన్ చేస్తున్న ప్రయత్నాలపై వివరణాత్మక ప్రదర్శనను నిర్వహించారు. కార్మిక హక్కులు మరియు మానవ అక్రమ రవాణా నివారణపై అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయాలని ఈసందర్భంగా వారు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







