బహ్రెయిన్ లో అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందం..!!
- September 25, 2025
మనామా : అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందం బహ్రెయిన్ లో పర్యటిస్తుంది. వలస కార్మికుల రక్షణ కేంద్రంలో అమెరికా ప్రతినిధి బృందాన్ని బహ్రెయిన్ లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) స్వాగతించింది. కార్మికుల శ్రేయస్సుకు, అదే సమయంలో వారి హక్కులకు పరిరక్షణకు తీసుకుంటున్న చర్యల గురించి ప్రతినిధుల బృందానికి వివరించారు.
LMRA వ్యవస్థకు కనెక్ట్ అయిన ఆర్థిక సంస్థల ద్వారా అన్ని కార్మికుల జీతాలు ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లించబడుతున్నాయని, మెరుగైన వేతన రక్షణ వ్యవస్థ ముఖ్య కార్యక్రమాలలో ఇది ఒకటని తెలియజేశారు. వలస కార్మికుల రక్షణ కేంద్రం నేతృత్వంలో మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి బహ్రెయిన్ చేస్తున్న ప్రయత్నాలపై వివరణాత్మక ప్రదర్శనను నిర్వహించారు. కార్మిక హక్కులు మరియు మానవ అక్రమ రవాణా నివారణపై అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయాలని ఈసందర్భంగా వారు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- జూలై 9 వీసా గడువు: ఎవరి పై ప్రభావం? యూఏఈ స్పష్టీకరణ
- 37 లక్షలు దాటిన చార్ ధామ్ యాత్రికుల సంఖ్య..
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం







