బహ్రెయిన్ లో అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందం..!!
- September 25, 2025
మనామా : అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందం బహ్రెయిన్ లో పర్యటిస్తుంది. వలస కార్మికుల రక్షణ కేంద్రంలో అమెరికా ప్రతినిధి బృందాన్ని బహ్రెయిన్ లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) స్వాగతించింది. కార్మికుల శ్రేయస్సుకు, అదే సమయంలో వారి హక్కులకు పరిరక్షణకు తీసుకుంటున్న చర్యల గురించి ప్రతినిధుల బృందానికి వివరించారు.
LMRA వ్యవస్థకు కనెక్ట్ అయిన ఆర్థిక సంస్థల ద్వారా అన్ని కార్మికుల జీతాలు ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లించబడుతున్నాయని, మెరుగైన వేతన రక్షణ వ్యవస్థ ముఖ్య కార్యక్రమాలలో ఇది ఒకటని తెలియజేశారు. వలస కార్మికుల రక్షణ కేంద్రం నేతృత్వంలో మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి బహ్రెయిన్ చేస్తున్న ప్రయత్నాలపై వివరణాత్మక ప్రదర్శనను నిర్వహించారు. కార్మిక హక్కులు మరియు మానవ అక్రమ రవాణా నివారణపై అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయాలని ఈసందర్భంగా వారు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







