హైదరాబాద్ కమిషనర్గా సజ్జనార్
- September 27, 2025
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున బదిలీలు చేపట్టింది. శాంతి భద్రతల నిర్వహణ, పాలనలో వేగం పెంచడం, విభాగాల మధ్య సమన్వయం బలోపేతం చేయడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఆరుగురు ఐఏఎస్ అధికారులు, 23 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని ముఖ్యంగా ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు అధికారిక ప్రకటన రూపంలో వెల్లడించారు.
ఆర్టీసీ ఎండీగా సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న వీసీ సజ్జనార్ (VC Sajjanar) బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఎండీగా మరో ఐపీఎస్ అధికారి నాగిరెడ్డి నియమితులయ్యారు. ఇక సజ్జనార్ నాలుగేళ్ల తర్వాత యూనిఫాం వేసుకోనున్నారు. తాజాగా బదిలీల్లో భాగంగా ఆయన్ను రేవంత్ సర్కార్ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గా కీలక పోస్టులోకి పంపింది.
ప్రస్తుతం హైదరాబాద్ సీపీగా ఉన్న సీవీ ఆనంద్ను హోంశాఖ కార్యదర్శిగా నియమించారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగానికి చీఫ్గా విజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు.పౌర సరఫరాల శాఖ కమిషనర్గా స్టీఫెన్ రవీంద్ర, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా శిఖా గోయల్కు బాధ్యతలు అప్పగించారు. గ్రేహౌండ్స్ ఏడీజీగా అనిల్ కుమార్ను నియమించారు.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









