వరల్డ్ ఫుడ్ ఇండియాతో గ్లోబల్ పార్టనర్ షిప్..!!
- September 27, 2025
కువైట్: న్యూఢిల్లీలో ప్రారంభమైన వరల్డ్ ఫుడ్ ఇండియా 2025లో 21 దేశాలు నుంచి 150 మంది అంతర్జాతీయ ప్రతినిధుల హాజరయ్యారు. ఇందులో కువైట్ రాయబారి మిషాల్ ముస్తఫా అల్-షెమాలి పాల్గొని మాట్లాడారు. ఇది ప్రపంచ ఆహార మార్కెట్లతో అనుసంధానం చేసేందుకు ఒక ముఖ్యమైన వేదిక అని ఆయన ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమం ఆర్థికాభివృద్ధికి మరియు ఆహార రంగంలో పెట్టుబడులకు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉందని, ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆహార ఉత్పత్తిదారు, ఎగుమతిదారుగా ఇండియా ప్రముఖ పాత్రను పోషిస్తుందని ఆయన తెలిపారు.
ఈ ప్రదర్శన స్థిరమైన ఆహార మార్కెట్లు, ఆహార ఉత్పత్తి మౌలిక సదుపాయాలు, వ్యవసాయ ఆవిష్కరణలు మరియు ఉత్పాదకతను పెంచడానికి, ఈ రంగానికి అనుకూలమైన వాతావరణాన్ని నిర్ధారించడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలపై దృష్టి సారిస్తుందని అల్-షెమాలి హైలైట్ చేశారు.
సెప్టెంబర్ 25 నుండి 28 వరకు జరిగే ఇండియన్ గ్లోబల్ ఫుడ్ ఎక్స్పో ఎడిషన్ ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా భారతదేశ స్థానాన్ని మోడీ మరింతగా హైలైట్ చేశారు. ప్రపంచ ఉత్పత్తిలో 25% తోడ్పడు అందిస్తుందని, అదే సమయంలో బియ్యం, గోధుమలు, చిరుధాన్యాలు, పండ్లు, కూరగాయలు మరియు చేపల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉందన్నారు.
గ్లోబల్ ఎక్స్పోలో ఫ్రాన్స్, జర్మనీ, ఇరాన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, డెన్మార్క్, ఇటలీ, థాయిలాండ్, ఇండోనేషియా, తైవాన్, బెల్జియం, టాంజానియా, ఎరిట్రియా, సైప్రస్, ఆఫ్ఘనిస్తాన్, చైనా మరియు యునైటెడ్ స్టేట్స్ ప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







