2029 పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్షిప్కు ఖతార్ ఆతిథ్యం..!!
- September 27, 2025
దోహా: 2029 వాలీబాల్ పురుషుల ప్రపంచ ఛాంపియన్షిప్ నిర్వహణ హక్కులను ఖతార్ సాధించింది. ఈ సందర్భంగా ఖతార్ ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రెహ్మాన్ బిన్ జాసిమ్ అల్-థానీ హర్షం వ్యక్తం చేశారు. "2029 FIVB పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్షిప్కు ఆతిథ్యం ఇచ్చే విషయంలో ఖతార్ బిడ్ను గెలుచుకున్నందుకు మేము గర్విస్తున్నాము. ఇది మధ్యప్రాచ్యంలో మొదటిసారి జరుగుతోంది." అని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన పోస్ట్లో వెల్లడించారు.
సెప్టెంబర్ 26న ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన ఇంటర్నేషనల్ వాలీబాల్ ఫెడరేషన్ (FIVB) అడ్మినిస్ట్రేషన్ బోర్డ్ సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. FIVB వాలీబాల్ పురుషుల ప్రపంచ ఛాంపియన్షిప్ FIVB క్యాలెండర్లోని అత్యంత ప్రతిష్టాత్మక పోటీలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా 32 జాతీయ జట్లు పాల్గొంటాయి.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









