2029 పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్షిప్కు ఖతార్ ఆతిథ్యం..!!
- September 27, 2025
దోహా: 2029 వాలీబాల్ పురుషుల ప్రపంచ ఛాంపియన్షిప్ నిర్వహణ హక్కులను ఖతార్ సాధించింది. ఈ సందర్భంగా ఖతార్ ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రెహ్మాన్ బిన్ జాసిమ్ అల్-థానీ హర్షం వ్యక్తం చేశారు. "2029 FIVB పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్షిప్కు ఆతిథ్యం ఇచ్చే విషయంలో ఖతార్ బిడ్ను గెలుచుకున్నందుకు మేము గర్విస్తున్నాము. ఇది మధ్యప్రాచ్యంలో మొదటిసారి జరుగుతోంది." అని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన పోస్ట్లో వెల్లడించారు.
సెప్టెంబర్ 26న ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన ఇంటర్నేషనల్ వాలీబాల్ ఫెడరేషన్ (FIVB) అడ్మినిస్ట్రేషన్ బోర్డ్ సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. FIVB వాలీబాల్ పురుషుల ప్రపంచ ఛాంపియన్షిప్ FIVB క్యాలెండర్లోని అత్యంత ప్రతిష్టాత్మక పోటీలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా 32 జాతీయ జట్లు పాల్గొంటాయి.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









