8 ఏళ్ల తర్వాత మనామా సూక్ గేట్వే ఆర్ట్ వర్క్ తొలగింపు..!!
- September 29, 2025
మనామా: బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ (BTEA) నేతృత్వంలో మనామా సూక్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో భాగంగా బాబ్ అల్ బహ్రెయిన్ ప్రవేశ ద్వారం నుండి ప్రసిద్ధి చెందిన ఆర్ట్ ఇన్స్టాలేషన్ “అల్-ముర్తషా” తొలగించారు.
2017 నుండి సౌక్ ప్రధాన ద్వారం పైకప్పును అలంకరించిన ఈ ఆర్ట్ వర్క్.. ఈ ప్రాంతంలో అత్యంత విలక్షణమైన ఆర్ట్ వర్క్ గా ప్రసిద్ధి పొందింది. దీనిని కాయిన్స్ ఆకారంలో ఉన్న 20వేల కంటే ఎక్కువ బంగారు పూతతో కూడిన మెటల్ గొలుసులతో రూపొందించారు. ఈ ప్రాజెక్ట్ను 2017లో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తొలిసారిగా ప్రారంభించింది. అప్పటినుండి ఇది మనామా సూక్ సందర్శకులకు స్వాగత ద్వారంగా మారింది. ఇప్పుడు అభివృద్ధి ప్రణాళికలో భాగంగా దీనిని తొలగించినట్లు, త్వరలోనే దీని స్థానలంలో మరో అద్భుతమైన డిజైన్లతో రూపొందిస్తున్న ఆర్ట్ వర్క్ పీస్ ను ఇన్ స్టాల్ చేస్తామని ప్రకటించారు.
తాజా వార్తలు
- నా పేరుతో వచ్చే ఫేస్ బుక్ మెసేజ్ లను నమ్మకండి:సీపీ సజ్జనార్
- భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు
- కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!
- గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!
- దుబాయ్ లో స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు..!!
- కొత్త పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా జెడ్డా సెంట్రల్..!!
- ప్రైవేట్ రంగంలో రిటైర్ ఎంప్లాయిస్ కు గుడ్ న్యూస్..!!
- రుస్తాక్లోని తావి అల్-హరా మార్కెట్లో వింటర్ క్రాప్..!!
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి







