8 ఏళ్ల తర్వాత మనామా సూక్ గేట్వే ఆర్ట్ వర్క్ తొలగింపు..!!
- September 29, 2025
మనామా: బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ (BTEA) నేతృత్వంలో మనామా సూక్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో భాగంగా బాబ్ అల్ బహ్రెయిన్ ప్రవేశ ద్వారం నుండి ప్రసిద్ధి చెందిన ఆర్ట్ ఇన్స్టాలేషన్ “అల్-ముర్తషా” తొలగించారు.
2017 నుండి సౌక్ ప్రధాన ద్వారం పైకప్పును అలంకరించిన ఈ ఆర్ట్ వర్క్.. ఈ ప్రాంతంలో అత్యంత విలక్షణమైన ఆర్ట్ వర్క్ గా ప్రసిద్ధి పొందింది. దీనిని కాయిన్స్ ఆకారంలో ఉన్న 20వేల కంటే ఎక్కువ బంగారు పూతతో కూడిన మెటల్ గొలుసులతో రూపొందించారు. ఈ ప్రాజెక్ట్ను 2017లో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తొలిసారిగా ప్రారంభించింది. అప్పటినుండి ఇది మనామా సూక్ సందర్శకులకు స్వాగత ద్వారంగా మారింది. ఇప్పుడు అభివృద్ధి ప్రణాళికలో భాగంగా దీనిని తొలగించినట్లు, త్వరలోనే దీని స్థానలంలో మరో అద్భుతమైన డిజైన్లతో రూపొందిస్తున్న ఆర్ట్ వర్క్ పీస్ ను ఇన్ స్టాల్ చేస్తామని ప్రకటించారు.
తాజా వార్తలు
- కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం..ఏపీలో త్వరలో మరో కొత్త పథకం..!
- తెలంగాణ కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!









