8 ఏళ్ల తర్వాత మనామా సూక్ గేట్వే ఆర్ట్ వర్క్ తొలగింపు..!!
- September 29, 2025
మనామా: బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ (BTEA) నేతృత్వంలో మనామా సూక్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో భాగంగా బాబ్ అల్ బహ్రెయిన్ ప్రవేశ ద్వారం నుండి ప్రసిద్ధి చెందిన ఆర్ట్ ఇన్స్టాలేషన్ “అల్-ముర్తషా” తొలగించారు.
2017 నుండి సౌక్ ప్రధాన ద్వారం పైకప్పును అలంకరించిన ఈ ఆర్ట్ వర్క్.. ఈ ప్రాంతంలో అత్యంత విలక్షణమైన ఆర్ట్ వర్క్ గా ప్రసిద్ధి పొందింది. దీనిని కాయిన్స్ ఆకారంలో ఉన్న 20వేల కంటే ఎక్కువ బంగారు పూతతో కూడిన మెటల్ గొలుసులతో రూపొందించారు. ఈ ప్రాజెక్ట్ను 2017లో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తొలిసారిగా ప్రారంభించింది. అప్పటినుండి ఇది మనామా సూక్ సందర్శకులకు స్వాగత ద్వారంగా మారింది. ఇప్పుడు అభివృద్ధి ప్రణాళికలో భాగంగా దీనిని తొలగించినట్లు, త్వరలోనే దీని స్థానలంలో మరో అద్భుతమైన డిజైన్లతో రూపొందిస్తున్న ఆర్ట్ వర్క్ పీస్ ను ఇన్ స్టాల్ చేస్తామని ప్రకటించారు.
తాజా వార్తలు
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు







