ఖతార్ లో షెల్ ఎకో-మారథాన్ ఛాంపియన్షిప్..!!
- September 30, 2025
దోహా: 2025 షెల్ ఎకో-మారథాన్ ఆసియా-పసిఫిక్ మరియు మిడిల్ ఈస్ట్ పోటీలు విజయవంతం అయ్యాయి. ఈ నేపథ్యంలో 2026లో మరోసారి ఖతార్లో ఈ ఈవెంట్ను నిర్వహిస్తామని, ఆ తర్వాత 2027లో మొట్టమొదటి షెల్ ఎకో-మారథాన్ గ్లోబల్ ఛాంపియన్షిప్ను నిర్వహిస్తామని షెల్ ప్రకటించింది.
లుసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో 2025 ఎడిషన్ జరిగింది. ఈ ప్రోగ్రామ్ 40 ఏళ్ల చరిత్రలో ఈ ఈవెంట్ను మధ్యప్రాచ్యంలో నిర్వహించడం ఇదే మొదటిసారి అని నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలో 12 దేశాల నుండి 60 కి పైగా విద్యార్థి బృందాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా వారు ఎనర్టీ ఎఫిషియెంట్ వాహనల రూపకల్పనలో అత్యాధునిక ఆవిష్కరణలను ప్రదర్శించారని షెల్ కంపెనీస్ ఖతార్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చైర్పర్సన్ రాబ్ మాక్స్ వెల్ వెల్లడించారు. 2027 షెల్ ఎకో-మారథాన్ గ్లోబల్ ఛాంపియన్షిప్ ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరు కనబరిచే జట్లను ఒకచోటకు చేర్చుతుందన్నారు.
తాజా వార్తలు
- డ్రగ్స్ పై ఉక్కుపాదమే అంటున్న సీపీ సజ్జనార్
- ప్రార్థనా స్థలాలే టార్గెట్..కువైట్ లో టెర్రరిస్ట్ అరెస్టు..!!
- ఒమన్ లో ఇన్వెస్ట్ మెంట్స్.. FSA వార్నింగ్ అలెర్ట్..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక.. స్వాగతించిన మిడిలీస్టు, యూరోపియన్..!!
- పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- హ్యుమన్ ట్రాఫికింగ్..అంతర్జాతీయ రోల్ మోడల్గా బహ్రెయిన్..!!
- ఖతార్ లో షెల్ ఎకో-మారథాన్ ఛాంపియన్షిప్..!!
- విప్లవం’ పోస్ట్ తో తమిళనాడులో పెనుదుమారం
- ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఫీజు రూపాయి మాత్రమే
- బాలకృష్ణ–చిరంజీవి వివాదం: 300 కేసుల యోచన రద్దు