ఖతార్ లో షెల్ ఎకో-మారథాన్ ఛాంపియన్షిప్..!!
- September 30, 2025
దోహా: 2025 షెల్ ఎకో-మారథాన్ ఆసియా-పసిఫిక్ మరియు మిడిల్ ఈస్ట్ పోటీలు విజయవంతం అయ్యాయి. ఈ నేపథ్యంలో 2026లో మరోసారి ఖతార్లో ఈ ఈవెంట్ను నిర్వహిస్తామని, ఆ తర్వాత 2027లో మొట్టమొదటి షెల్ ఎకో-మారథాన్ గ్లోబల్ ఛాంపియన్షిప్ను నిర్వహిస్తామని షెల్ ప్రకటించింది.
లుసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో 2025 ఎడిషన్ జరిగింది. ఈ ప్రోగ్రామ్ 40 ఏళ్ల చరిత్రలో ఈ ఈవెంట్ను మధ్యప్రాచ్యంలో నిర్వహించడం ఇదే మొదటిసారి అని నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలో 12 దేశాల నుండి 60 కి పైగా విద్యార్థి బృందాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా వారు ఎనర్టీ ఎఫిషియెంట్ వాహనల రూపకల్పనలో అత్యాధునిక ఆవిష్కరణలను ప్రదర్శించారని షెల్ కంపెనీస్ ఖతార్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చైర్పర్సన్ రాబ్ మాక్స్ వెల్ వెల్లడించారు. 2027 షెల్ ఎకో-మారథాన్ గ్లోబల్ ఛాంపియన్షిప్ ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరు కనబరిచే జట్లను ఒకచోటకు చేర్చుతుందన్నారు.
తాజా వార్తలు
- సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రథమ స్థానం
- ఏపీ కేబినెట్లో 34 కీలక అంశాలకు ఆమోదం..
- ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.557కోట్లు !!
- హైదరాబాద్లో నో టాలరెన్స్ జోన్ల ఏర్పాటు
- దుబాయ్ కస్టమ్స్ కీలక నిర్ణయం..Dh1,000 వరకు దిగుమతి వస్తువులకు కస్టమ్స్ సుంకం మినహాయింపు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!







