క్రిప్టోకరెన్సీ మైనింగ్ను నిషేధించిన అబుదాబి..!!
- October 01, 2025
యూఏఈ: అగ్రికల్చర్ ల్యాండ్ పై క్రిప్టోకరెన్సీ మైనింగ్పై అబుదాబి నిషేధం విధించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 1 లక్ష దిర్హామ్ల ఫైన్ విధిస్తామని హెచ్చరించారు. ఉల్లంఘనలు రిపీట్ అయితే జరిమానా మొత్తం రెట్టింపు అవుతుందని స్పష్టం చేసింది. పలు ఫార్మ్ లలో ఉల్లంఘనలను అధికారులు గుర్తించారని, ఈ నేఫథ్యంలో నిషేధం విధించినట్లు అబుదాబి వ్యవసాయం మరియు ఆహార భద్రతా అథారిటీ (అడాఫ్సా) వెల్లడించింది.
2024లో ఫార్మ్స్ లో క్రిప్టో మైనింగ్ చేస్తున్నప్పుడు పట్టుబడిన వారికి 10వేల దిర్హామ్లు వరకు జరిమానా విధించారు. ఇప్పుడు ఆ జరిమానాను 900 శాతం పెంచారు. క్రిప్టోకరెన్సీ మైనింగ్లో పార్టిసిపేట్ అయ్యే ఫార్మ్స్ యజమానులు , రెంటర్స్ ఇద్దరిని బాధ్యులుగా గుర్తిస్తామని వెల్లడించారు. ఇటువంటి పద్ధతులు వ్యవసాయ స్థిరత్వం , జీవన భద్రతపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని అధికారులు తెలిపారు. అలాంటి వాటికి విద్యుత్ లాంటి సేవలను నిలిపి వేస్తారని పేర్కొన్నారు. ఉల్లంఘించిన వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
తాజా వార్తలు
- లోక్సభ లెజిస్లేషన్ కమిటీ సమావేశం నిర్వహించిన ఎంపీ బాలశౌరి
- గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని మోడీ ని ఆహ్వానించాలి: సీఎం రేవంత్
- 2030 కామన్వెల్త్ గేమ్స్ కోసం అహ్మదాబాద్ సిద్దం
- హాంకాంగ్లో ఘోర అగ్ని ప్రమాదం..13 మంది సజీవదహనం..
- అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..!!
- కెనడా eTA కి ఖతారీ జాతీయులు అర్హులు..!!
- సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ..!!
- మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?
- 'ఒమన్ ఒడిస్సీ' పుస్తకం విడుదల..!!
- BD 130,000 పెట్టుబడికే బహ్రెయిన్ గోల్డెన్ రెసిడెన్సీ..!!







