క్రిప్టోకరెన్సీ మైనింగ్ను నిషేధించిన అబుదాబి..!!
- October 01, 2025
యూఏఈ: అగ్రికల్చర్ ల్యాండ్ పై క్రిప్టోకరెన్సీ మైనింగ్పై అబుదాబి నిషేధం విధించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 1 లక్ష దిర్హామ్ల ఫైన్ విధిస్తామని హెచ్చరించారు. ఉల్లంఘనలు రిపీట్ అయితే జరిమానా మొత్తం రెట్టింపు అవుతుందని స్పష్టం చేసింది. పలు ఫార్మ్ లలో ఉల్లంఘనలను అధికారులు గుర్తించారని, ఈ నేఫథ్యంలో నిషేధం విధించినట్లు అబుదాబి వ్యవసాయం మరియు ఆహార భద్రతా అథారిటీ (అడాఫ్సా) వెల్లడించింది.
2024లో ఫార్మ్స్ లో క్రిప్టో మైనింగ్ చేస్తున్నప్పుడు పట్టుబడిన వారికి 10వేల దిర్హామ్లు వరకు జరిమానా విధించారు. ఇప్పుడు ఆ జరిమానాను 900 శాతం పెంచారు. క్రిప్టోకరెన్సీ మైనింగ్లో పార్టిసిపేట్ అయ్యే ఫార్మ్స్ యజమానులు , రెంటర్స్ ఇద్దరిని బాధ్యులుగా గుర్తిస్తామని వెల్లడించారు. ఇటువంటి పద్ధతులు వ్యవసాయ స్థిరత్వం , జీవన భద్రతపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని అధికారులు తెలిపారు. అలాంటి వాటికి విద్యుత్ లాంటి సేవలను నిలిపి వేస్తారని పేర్కొన్నారు. ఉల్లంఘించిన వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
తాజా వార్తలు
- FIFA అరబ్ కప్ ఖతార్ 2025 టికెట్ల అమ్మకాలు ప్రారంభం..!!
- విదేశీ ప్రయాణికులు భారత్ కొత్త కండిషన్..!!
- బహ్రెయిన్లో షరోదుత్సోబ్ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో 3.2శాతానికి చేరుకున్న నిరుద్యోగ రేటు..!!
- కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం సామర్థ్యం పెంపు..!!
- క్రిప్టోకరెన్సీ మైనింగ్ను నిషేధించిన అబుదాబి..!!
- ఢిల్లీ ఎయిర్పోర్టులో ఈ-అరైవల్ కార్డ్ సిస్టమ్
- కరూర్ తొక్కిసలాట ఘటన..స్టాలిన్ ప్రభుత్వం సంచలన వీడియో..
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు భేటీ
- తొక్కిసలాట పై స్పందించిన విజయ్