క్రిప్టోకరెన్సీ మైనింగ్ను నిషేధించిన అబుదాబి..!!
- October 01, 2025
యూఏఈ: అగ్రికల్చర్ ల్యాండ్ పై క్రిప్టోకరెన్సీ మైనింగ్పై అబుదాబి నిషేధం విధించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 1 లక్ష దిర్హామ్ల ఫైన్ విధిస్తామని హెచ్చరించారు. ఉల్లంఘనలు రిపీట్ అయితే జరిమానా మొత్తం రెట్టింపు అవుతుందని స్పష్టం చేసింది. పలు ఫార్మ్ లలో ఉల్లంఘనలను అధికారులు గుర్తించారని, ఈ నేఫథ్యంలో నిషేధం విధించినట్లు అబుదాబి వ్యవసాయం మరియు ఆహార భద్రతా అథారిటీ (అడాఫ్సా) వెల్లడించింది.
2024లో ఫార్మ్స్ లో క్రిప్టో మైనింగ్ చేస్తున్నప్పుడు పట్టుబడిన వారికి 10వేల దిర్హామ్లు వరకు జరిమానా విధించారు. ఇప్పుడు ఆ జరిమానాను 900 శాతం పెంచారు. క్రిప్టోకరెన్సీ మైనింగ్లో పార్టిసిపేట్ అయ్యే ఫార్మ్స్ యజమానులు , రెంటర్స్ ఇద్దరిని బాధ్యులుగా గుర్తిస్తామని వెల్లడించారు. ఇటువంటి పద్ధతులు వ్యవసాయ స్థిరత్వం , జీవన భద్రతపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని అధికారులు తెలిపారు. అలాంటి వాటికి విద్యుత్ లాంటి సేవలను నిలిపి వేస్తారని పేర్కొన్నారు. ఉల్లంఘించిన వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు







