క్రిప్టోకరెన్సీ మైనింగ్ను నిషేధించిన అబుదాబి..!!
- October 01, 2025
యూఏఈ: అగ్రికల్చర్ ల్యాండ్ పై క్రిప్టోకరెన్సీ మైనింగ్పై అబుదాబి నిషేధం విధించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 1 లక్ష దిర్హామ్ల ఫైన్ విధిస్తామని హెచ్చరించారు. ఉల్లంఘనలు రిపీట్ అయితే జరిమానా మొత్తం రెట్టింపు అవుతుందని స్పష్టం చేసింది. పలు ఫార్మ్ లలో ఉల్లంఘనలను అధికారులు గుర్తించారని, ఈ నేఫథ్యంలో నిషేధం విధించినట్లు అబుదాబి వ్యవసాయం మరియు ఆహార భద్రతా అథారిటీ (అడాఫ్సా) వెల్లడించింది.
2024లో ఫార్మ్స్ లో క్రిప్టో మైనింగ్ చేస్తున్నప్పుడు పట్టుబడిన వారికి 10వేల దిర్హామ్లు వరకు జరిమానా విధించారు. ఇప్పుడు ఆ జరిమానాను 900 శాతం పెంచారు. క్రిప్టోకరెన్సీ మైనింగ్లో పార్టిసిపేట్ అయ్యే ఫార్మ్స్ యజమానులు , రెంటర్స్ ఇద్దరిని బాధ్యులుగా గుర్తిస్తామని వెల్లడించారు. ఇటువంటి పద్ధతులు వ్యవసాయ స్థిరత్వం , జీవన భద్రతపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని అధికారులు తెలిపారు. అలాంటి వాటికి విద్యుత్ లాంటి సేవలను నిలిపి వేస్తారని పేర్కొన్నారు. ఉల్లంఘించిన వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా, వీసా ట్రేడింగ్..ఆఫీసుపై రైడ్స్..!!
- సౌదీ బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డా..తల్లిదండ్రులను కోల్పోయాడు..!!
- బహ్రెయిన్-నాటో సంబంధాల్లో కొత్త అధ్యాయం..!!
- బౌషర్లో శాంతికి భంగం..122 మంది అరెస్ట్..!!
- ఖలీఫా అల్ అత్తియా ఇంటర్చేంజ్ మూసివేత..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ను స్వాగతించిన ట్రంప్..!!
- సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
- సహాంలో పది మంది అరెస్టు..!!







