కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- October 01, 2025
కువైట్: KNET డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డులను ఎలక్ట్రానిక్ చెల్లింపులపై కువైట్లోని కస్టమర్ల నుండి అదనపు రుసుములు లేదా కమీషన్లు వసూలు చేయడాన్ని నిషేధించాలని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ (CBK) ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు అన్ని స్థానిక బ్యాంకులు, ఎలక్ట్రానిక్ చెల్లింపు సేవా సంస్థలు, ఇ-మనీ సేవా కేంద్రాలకు వర్తిస్తాయని స్పష్టం చేసింది.
పాయింట్-ఆఫ్-సేల్ (POS) పరికరాలు లేదా ఎలక్ట్రానిక్ చెల్లింపు గేట్వేల ద్వారా ఉపయోగించిన సందర్ధాల్లోనూ అదనపు రుసుములను వసూలు చేయొద్దని ఆదేశించింది. డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించిన సమయంలో వ్యాపారులు కస్టమర్ల వద్ద నుంచి అదనపు మొత్తాలను వసూలు చేస్తున్నట్లు అందిన ఫిర్యాదులకు వ్యతిరేకంగా ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించింది. నిబంధనలను ఉల్లంఘించే సంస్థలు పాటించకపోతే సేవలను నిలిపివేయడంతోపాటు ఆయా వ్యాపార సంస్థలతో ఉన్న అన్ని ఒప్పందాలను రద్దు చేస్తామని కువైట్ సెంట్రల్ బ్యాంక్ హెచ్చరించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- ఇబ్రిలో పొల్యుషన్ ఎమర్జెన్సీపై పర్యావరణ అథారిటీ క్లారిటీ..!!
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకారం