భారీ ఉగ్ర కుట్రకు చెక్
- July 21, 2016
మొన్న హైదరాబాద్.. నేడు ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ గఢ్.. దేశంపై ఏ క్షణంలోనైనా ఉగ్ర చర్యతో విరుచుకుపడాలని చూస్తోన్న ఉగ్రవాదులు తాజాగా ఉత్తరప్రదేశ్ ను టార్గెట్ చేశారు. భారీ భీభత్సానికి కుట్ర పన్నిన ముష్కరులు ప్రతాప్ గఢ్ లోని ఓ హిందూ దేవాలయంలో ఏకంగా 30 బాంబులను పెట్టడం సంచలనంగా మారింది.
అయితే అప్రమత్తమైన ఇంటలిజెన్స్ చర్యలతో ఈ భారీ ఉగ్ర కుట్రకు చెక్ పడింది. హిందూ దేవాలయంలో బాంబులు పెట్టారన్న విషయాన్ని పసిగట్టిన పోలీసులు.. ఏ క్షణాన అయినా బాంబులు పేల్చేందుకు సిద్దమవుతున్న ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. ఇద్దరి వద్ద నుంచి పెద్ద సంఖ్యలో పిస్టళ్లు, కాట్రిడ్జ్ లతో పాటు ఆలయంలో పెట్టిన 30 బాంబులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
కాగా, ఆలయంలో బాంబులు పెట్టిన ఉగ్రవాదులు.. వాటిని పేల్చే క్షణం కోసం కాచుకు కూర్చున్నారు. ఇంతలోనే విషయం జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కు చేరడంతో, రంగంలొకి ఇంటెలిజెన్స్ పోలీస్ ముష్కర దాడికి అడ్డుకట్టవేశారు. దీంతో దేశంలో భారీ ఉగ్ర కుట్ర భగ్నమం కాగా, ఉగ్రవాద తాజా కుట్ర నేపథ్యంలో దేశంలొ భద్రతను మరింత అప్రమత్తం చేయనున్నట్లుగా సమాచారం.
తాజా వార్తలు
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!







