పౌరుల హక్కుల పరిరక్షణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కీలకం..!!
- October 04, 2025
కువైట్: గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాల పబ్లిక్ ప్రాసిక్యూటర్ల 17వ సమావేశం కువైట్లో జరిగింది. చట్టాలను అమలు చేయడంలో మరియు పౌరుల హక్కులను పరిరక్షించడంలో వారి భాగస్వామ్యాన్ని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. GCC దేశాలలోని పబ్లిక్ ప్రాసిక్యూషన్ మరియు అటార్నీ జనరల్ సంస్థలు సమాజ సంరక్షకులుగా, హక్కుల రక్షకులుగా గొప్ప బాధ్యతను కలిగి ఉన్నారని సెషన్కు అధ్యక్షత వహించిన అటార్నీ జనరల్ సాద్ అల్-సఫ్రాన్ అన్నారు.
GCC చట్టపరమైన సంస్థల సామర్థ్యం మరియు ప్రభావాన్ని మెరుగుపరిచే సిఫార్సులను జారీ చేయడమే లక్ష్యమని ఆయన అన్నారు. ఈ సమావేశం GCC దేశాల మధ్య సోదర బంధాలను ప్రతిబింబిస్తుందన్నారు. GCC ప్రాసిక్యూటర్లు న్యాయ మరియు చట్టపరమైన భద్రతకు మూలస్తంభం అని GCC సెక్రటేరియట్లోని శాసన మరియు న్యాయ వ్యవహారాల అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ సుల్తాన్ అల్-సువైది పేర్కొన్నారు. అన్ని రూపాల్లో నేరాలను ఎదుర్కోవడంలో వారు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. ఈ సమావేశంలో ప్రత్యేకంగా యూరోపియన్ యూనియన్ ఏజెన్సీ ఫర్ క్రిమినల్ జస్టిస్ కోఆపరేషన్ (యూరోజస్ట్) వైస్ ప్రెసిడెంట్ జోస్ డి లామాటా పాల్గొన్నారు. అధునాతన నేరాల యుగంలో సమాచారం మరియు ఫోరెన్సిక్ ఆధారాల వేగవంతమైన మార్పిడికి, ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాలు, అవినీతి మరియు సైబర్ నేరాలపై దర్యాప్తులను సమన్వయం చేయడానికి EU ఏజెన్సీ లాంటి సంస్థలతో కలిసి పనిచేయడం ముఖ్యమైన పరిణామమని డి లామాటా పేర్కొన్నారు.
కువైట్ పబ్లిక్ ప్రాసిక్యూషన్లో చీఫ్ ప్రాసిక్యూటర్ తలాల్ అల్-ఫహాద్కు 2025 హమీద్ అల్-ఓత్మాన్ ఎక్సలెన్స్ అవార్డును ప్రదానంతో సమావేశం ముగిసింది.
తాజా వార్తలు
- పౌరుల హక్కుల పరిరక్షణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కీలకం..!!
- రెసిలెన్స్ ఫ్లీట్లో పౌరుల భద్రతపై ఒమన్ పర్యవేక్షణ..!!
- రక్షణ సంబంధాలపై సౌదీ, ఖతార్ చర్చలు..!!
- UK సినగోగ్ పై ఘోరమైన దాడి.. ఖండించిన బహ్రెయిన్..!!
- దుబాయ్లో అక్రమ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ క్లినిక్..!!
- తప్పిపోయిన ఫాల్కన్ల ఓనర్లకు గుడ్ న్యూస్..!!
- ఫ్లిప్కార్ట్ లో ఈ రోజు అర్ధరాత్రి నుంచి అక్టోబర్ 8 వరకు ఆఫర్లు
- బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసిన సౌదీ సెంట్రల్ బ్యాంక్..!!
- క్రిమినల్ జస్టిస్.. ఖతార్ లో కొత్త విభాగం ఏర్పాటు..!!
- అనుమతి లేకుండా ఫిల్మింగ్..వ్యక్తికి Dh30,000 ఫైన్..!!