పౌరుల హక్కుల పరిరక్షణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కీలకం..!!
- October 04, 2025
కువైట్: గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాల పబ్లిక్ ప్రాసిక్యూటర్ల 17వ సమావేశం కువైట్లో జరిగింది. చట్టాలను అమలు చేయడంలో మరియు పౌరుల హక్కులను పరిరక్షించడంలో వారి భాగస్వామ్యాన్ని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. GCC దేశాలలోని పబ్లిక్ ప్రాసిక్యూషన్ మరియు అటార్నీ జనరల్ సంస్థలు సమాజ సంరక్షకులుగా, హక్కుల రక్షకులుగా గొప్ప బాధ్యతను కలిగి ఉన్నారని సెషన్కు అధ్యక్షత వహించిన అటార్నీ జనరల్ సాద్ అల్-సఫ్రాన్ అన్నారు.
GCC చట్టపరమైన సంస్థల సామర్థ్యం మరియు ప్రభావాన్ని మెరుగుపరిచే సిఫార్సులను జారీ చేయడమే లక్ష్యమని ఆయన అన్నారు. ఈ సమావేశం GCC దేశాల మధ్య సోదర బంధాలను ప్రతిబింబిస్తుందన్నారు. GCC ప్రాసిక్యూటర్లు న్యాయ మరియు చట్టపరమైన భద్రతకు మూలస్తంభం అని GCC సెక్రటేరియట్లోని శాసన మరియు న్యాయ వ్యవహారాల అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ సుల్తాన్ అల్-సువైది పేర్కొన్నారు. అన్ని రూపాల్లో నేరాలను ఎదుర్కోవడంలో వారు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. ఈ సమావేశంలో ప్రత్యేకంగా యూరోపియన్ యూనియన్ ఏజెన్సీ ఫర్ క్రిమినల్ జస్టిస్ కోఆపరేషన్ (యూరోజస్ట్) వైస్ ప్రెసిడెంట్ జోస్ డి లామాటా పాల్గొన్నారు. అధునాతన నేరాల యుగంలో సమాచారం మరియు ఫోరెన్సిక్ ఆధారాల వేగవంతమైన మార్పిడికి, ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాలు, అవినీతి మరియు సైబర్ నేరాలపై దర్యాప్తులను సమన్వయం చేయడానికి EU ఏజెన్సీ లాంటి సంస్థలతో కలిసి పనిచేయడం ముఖ్యమైన పరిణామమని డి లామాటా పేర్కొన్నారు.
కువైట్ పబ్లిక్ ప్రాసిక్యూషన్లో చీఫ్ ప్రాసిక్యూటర్ తలాల్ అల్-ఫహాద్కు 2025 హమీద్ అల్-ఓత్మాన్ ఎక్సలెన్స్ అవార్డును ప్రదానంతో సమావేశం ముగిసింది.
తాజా వార్తలు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!
- సలాలా పోర్టు లో ఎయిర్ క్వాలిటీ పై ఆందోళన వద్దు..!!
- ముగియనున్న మలేషియా మైగ్రంట్ రేపట్రియేషన్ ప్రోగ్రాం 2.0 ఆమ్నెస్టీ పథకం
- డల్లాస్ లో NATS బోర్డు సమావేశం NATS మరింత విస్తరణ దిశగా అడుగులు









