ప్రపంచ వేదికపై మొదటి ఎమిరాటీగా మరియం రికార్డు..!!
- October 04, 2025
యూఏఈ: మిస్ యూనివర్స్ యూఏఈ 2025 కిరీటాన్ని ఫ్యాషన్ విద్యార్థిని అయిన మరియం మొహమ్మద్ సాధించి రికార్డు సృష్టించారు. కఠినమైన ఎంపిక ప్రక్రియ తర్వాత వందలాది మంది దరఖాస్తుదారుల నుండి ఆమె ఎంపికయ్యారు. 27 ఏళ్ల మరియం వచ్చే నెలలో థాయిలాండ్లో జరగనున్న మిస్ యూనివర్స్ 2025లో వేదికపైకి వచ్చిన మొదటి ఎమిరాటీ మహిళగా చరిత్ర సృష్టించనున్నారు. ఈ సందర్భంగా “పెద్ద కలలు కనడానికి యూఏఈ నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది” అని ఆమె అన్నారు. తాను మహిళల గొంతుకగా ఉండాలని అనుకుంటున్నట్లు తెలిపారు. మిస్ యూనివర్స్ అనేది కేవలం అందానికే కాదని, మహిళ సాధికారితకు గ్లోబల్ వేదికని తెలిపారు.
సిడ్నీ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందిన మరియం, ప్రస్తుతం ESMOD దుబాయ్లో ఫ్యాషన్ డిజైన్ చదువుతున్నారు. పేదరికంతో పోరాడటం, మహిళలకు సాధికారత కల్పించడం మరియు ప్రేమ, శాంతితో కూడిన సమాజాలను పెంపొందించడం తన లక్ష్యం అని మరియం పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 950 మందికి పైగా దరఖాస్తుదారులతో పోటీకి అద్భుతమైన స్పందన వచ్చిందని మిస్ యూనివర్స్ యూఏఈ జాతీయ డైరెక్టర్ పాపీ కాపెల్లా అన్నారు.
తాజా వార్తలు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!
- సలాలా పోర్టు లో ఎయిర్ క్వాలిటీ పై ఆందోళన వద్దు..!!
- ముగియనున్న మలేషియా మైగ్రంట్ రేపట్రియేషన్ ప్రోగ్రాం 2.0 ఆమ్నెస్టీ పథకం
- డల్లాస్ లో NATS బోర్డు సమావేశం NATS మరింత విస్తరణ దిశగా అడుగులు









