ప్రపంచ వేదికపై మొదటి ఎమిరాటీగా మరియం రికార్డు..!!
- October 04, 2025
యూఏఈ: మిస్ యూనివర్స్ యూఏఈ 2025 కిరీటాన్ని ఫ్యాషన్ విద్యార్థిని అయిన మరియం మొహమ్మద్ సాధించి రికార్డు సృష్టించారు. కఠినమైన ఎంపిక ప్రక్రియ తర్వాత వందలాది మంది దరఖాస్తుదారుల నుండి ఆమె ఎంపికయ్యారు. 27 ఏళ్ల మరియం వచ్చే నెలలో థాయిలాండ్లో జరగనున్న మిస్ యూనివర్స్ 2025లో వేదికపైకి వచ్చిన మొదటి ఎమిరాటీ మహిళగా చరిత్ర సృష్టించనున్నారు. ఈ సందర్భంగా “పెద్ద కలలు కనడానికి యూఏఈ నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది” అని ఆమె అన్నారు. తాను మహిళల గొంతుకగా ఉండాలని అనుకుంటున్నట్లు తెలిపారు. మిస్ యూనివర్స్ అనేది కేవలం అందానికే కాదని, మహిళ సాధికారితకు గ్లోబల్ వేదికని తెలిపారు.
సిడ్నీ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందిన మరియం, ప్రస్తుతం ESMOD దుబాయ్లో ఫ్యాషన్ డిజైన్ చదువుతున్నారు. పేదరికంతో పోరాడటం, మహిళలకు సాధికారత కల్పించడం మరియు ప్రేమ, శాంతితో కూడిన సమాజాలను పెంపొందించడం తన లక్ష్యం అని మరియం పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 950 మందికి పైగా దరఖాస్తుదారులతో పోటీకి అద్భుతమైన స్పందన వచ్చిందని మిస్ యూనివర్స్ యూఏఈ జాతీయ డైరెక్టర్ పాపీ కాపెల్లా అన్నారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







