ప్రపంచ వేదికపై మొదటి ఎమిరాటీగా మరియం రికార్డు..!!
- October 04, 2025
యూఏఈ: మిస్ యూనివర్స్ యూఏఈ 2025 కిరీటాన్ని ఫ్యాషన్ విద్యార్థిని అయిన మరియం మొహమ్మద్ సాధించి రికార్డు సృష్టించారు. కఠినమైన ఎంపిక ప్రక్రియ తర్వాత వందలాది మంది దరఖాస్తుదారుల నుండి ఆమె ఎంపికయ్యారు. 27 ఏళ్ల మరియం వచ్చే నెలలో థాయిలాండ్లో జరగనున్న మిస్ యూనివర్స్ 2025లో వేదికపైకి వచ్చిన మొదటి ఎమిరాటీ మహిళగా చరిత్ర సృష్టించనున్నారు. ఈ సందర్భంగా “పెద్ద కలలు కనడానికి యూఏఈ నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది” అని ఆమె అన్నారు. తాను మహిళల గొంతుకగా ఉండాలని అనుకుంటున్నట్లు తెలిపారు. మిస్ యూనివర్స్ అనేది కేవలం అందానికే కాదని, మహిళ సాధికారితకు గ్లోబల్ వేదికని తెలిపారు.
సిడ్నీ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందిన మరియం, ప్రస్తుతం ESMOD దుబాయ్లో ఫ్యాషన్ డిజైన్ చదువుతున్నారు. పేదరికంతో పోరాడటం, మహిళలకు సాధికారత కల్పించడం మరియు ప్రేమ, శాంతితో కూడిన సమాజాలను పెంపొందించడం తన లక్ష్యం అని మరియం పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 950 మందికి పైగా దరఖాస్తుదారులతో పోటీకి అద్భుతమైన స్పందన వచ్చిందని మిస్ యూనివర్స్ యూఏఈ జాతీయ డైరెక్టర్ పాపీ కాపెల్లా అన్నారు.
తాజా వార్తలు
- యూరప్కు అక్రమంగా తరలిస్తున్న 7 కోట్ల సిగరెట్లను అడ్డుకున్న దుబాయ్ కస్టమ్స్
- ADNOC నౌక పై ఇరాన్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!







