కువైట్ లో 28వేల మంది పై బహిష్కరణ వేటు..!!
- October 06, 2025
కువైట్: జనవరి మరియు సెప్టెంబర్ మధ్య వివిధ దేశాలకు చెందిన 28,984 మందికి పైగా ప్రవాసులను కువైట్ బహిష్కరించింది. ఇందులో ఎక్కువ మంది నివాస చట్టాన్ని ఉల్లంఘించినవారు ఉన్నారని తెలిపింది. బహిష్కరించిన వారికి స్పాన్సర్ విమాన టికెట్ అందించకపోతే, డిపోర్టేషన్ శాఖతో కలిసి పనిచేసే ఆమోదం పొందిన ట్రావెల్ ఏజెన్సీల ద్వారా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ టిక్కెట్ ఖర్చులను చెల్లిస్తుందన్నారు. ఆ తర్వాత మంత్రిత్వ శాఖ స్పాన్సర్ నుండి ఖర్చును తిరిగి పొందుతుందని, చెల్లింపు ప్రక్రియ ముగిసే వరకు వారి ప్రయాణంపై నిషేధాన్ని విధిస్తామని తెలిపింది.
వ్యక్తికి చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ లేదా అత్యవసర ప్రయాణ పత్రం ఉంటే బహిష్కరణ ప్రక్రియ సాధారణంగా మూడు రోజులు పడుతుందన్నారు. అయితే, కొన్ని కేసులకు రాయబార కార్యాలయ ప్రక్రియల్లో జాప్యం లేదా కోర్టు హాజరు వంటి కారణాలతో ఎక్కువ సమయం పడుతుందని వెల్లడించింది. ఇక ప్రయాణ పత్రాలు లేని వారికి, బహిష్కరణ పూర్తి చేయడానికి వీలుగా అత్యవసర పాస్పోర్ట్లను జారీ చేయడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆయా దేశాల రాయబార కార్యాలయాలతో సమన్వయంతో పనిచేస్తుందన్నారు. అక్రమ వలసదారులను గుర్తించేందుకు దేశ వ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతున్నాయని మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?









