కువైట్ లో 28వేల మంది పై బహిష్కరణ వేటు..!!
- October 06, 2025
కువైట్: జనవరి మరియు సెప్టెంబర్ మధ్య వివిధ దేశాలకు చెందిన 28,984 మందికి పైగా ప్రవాసులను కువైట్ బహిష్కరించింది. ఇందులో ఎక్కువ మంది నివాస చట్టాన్ని ఉల్లంఘించినవారు ఉన్నారని తెలిపింది. బహిష్కరించిన వారికి స్పాన్సర్ విమాన టికెట్ అందించకపోతే, డిపోర్టేషన్ శాఖతో కలిసి పనిచేసే ఆమోదం పొందిన ట్రావెల్ ఏజెన్సీల ద్వారా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ టిక్కెట్ ఖర్చులను చెల్లిస్తుందన్నారు. ఆ తర్వాత మంత్రిత్వ శాఖ స్పాన్సర్ నుండి ఖర్చును తిరిగి పొందుతుందని, చెల్లింపు ప్రక్రియ ముగిసే వరకు వారి ప్రయాణంపై నిషేధాన్ని విధిస్తామని తెలిపింది.
వ్యక్తికి చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ లేదా అత్యవసర ప్రయాణ పత్రం ఉంటే బహిష్కరణ ప్రక్రియ సాధారణంగా మూడు రోజులు పడుతుందన్నారు. అయితే, కొన్ని కేసులకు రాయబార కార్యాలయ ప్రక్రియల్లో జాప్యం లేదా కోర్టు హాజరు వంటి కారణాలతో ఎక్కువ సమయం పడుతుందని వెల్లడించింది. ఇక ప్రయాణ పత్రాలు లేని వారికి, బహిష్కరణ పూర్తి చేయడానికి వీలుగా అత్యవసర పాస్పోర్ట్లను జారీ చేయడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆయా దేశాల రాయబార కార్యాలయాలతో సమన్వయంతో పనిచేస్తుందన్నారు. అక్రమ వలసదారులను గుర్తించేందుకు దేశ వ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతున్నాయని మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- ఖతార్ లో యాంటీ-డోపింగ్ ఏజెన్సీ ఏర్పాటు..!!
- మూసివేతపై ముంటాజా మార్కెట్ క్లారిటీ..!!
- కువైట్ లో 28వేల మంది పై బహిష్కరణ వేటు..!!
- గ్లోబర్ స్పేస్ ఇండస్ట్రీకి రీజినల్ హబ్ గా ఒమన్..!!
- ఏ వీసా ఉన్నా ఉమ్రా చేయవచ్చు: హజ్ మంత్రిత్వ శాఖ
- దుబాయ్లో ఇంజనీరింగ్ కన్సల్టెన్సీల కోసం కొత్త చట్టం..!!
- ఎవరెస్టు పై మంచుతుఫాను..1000 మంది దిగ్బంధం
- By Mistake డబ్బు పంపారా? ఈ నంబర్కు కాల్ చేయండి!
- ఐసీసీ మహిళల ప్రపంచ కప్: పాక్ ని చిత్తు చిత్తుగా ఓడించిన భారత్..
- గూగుల్ క్రోమ్ వినియోగదారులకు కేంద్రం హెచ్చరిక