మూసివేతపై ముంటాజా మార్కెట్ క్లారిటీ..!!
- October 06, 2025
మనామా: ముంటాజా మార్కెట్ తన అన్ని శాఖలు పూర్తిగా పనిచేస్తున్నాయని, బహ్రెయిన్ అంతటా వినియోగదారులకు అంతరాయం లేకుండా సేవలను కొనసాగిస్తున్నాయని ధృవీకరించింది. మార్కెట్ పై ప్రభావితం చేసే ప్రస్తుత సవాళ్లను కంపెనీ గుర్తించిందని, ఇవి కొన్ని ఉత్పత్తుల లభ్యతను ప్రభావితం చేశాయని పేర్కొంది. ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక బృందాలు తీవ్రంగా పనిచేస్తున్నాయని, బ్యాంకులు మరియు సంబంధిత అధికారులతో నిరంతరం టచ్ లో ఉన్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఇటీవలి సోషల్ మీడియా పుకార్లపై స్పందించింది. ముంటాజా మార్కెట్ శాఖల మూసివేత అనేది పూర్తి కట్టుకథలని కొట్టిపారేసింది. అవి పూర్తిగా అబద్ధమని తెలిపింది. బహ్రెయిన్ సమాజానికి 42 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నట్లు వెల్లడించింది. తమకు అండగా ఉన్న కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపింది.
తాజా వార్తలు
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు
- హై-టెక్ సేవలను ప్రారంభించిన రాయల్ హాస్పిటల్..!!
- జూలై 1 నుండి 31 వరకు ఖతార్ టాయ్ ఫెస్టివల్..!!
- బహ్రెయిన్ లో దోమల వ్యాప్తి నివారణ పై స్పెషల్ ఫోకస్..!!
- కువైట్ లో మే 3 నుండి వైద్య సిబ్బందికి సెలవులు..!!
- ఆన్లైన్ కంటెంట్ పై సౌదీ అరేబియా కఠిన చర్యలు..!!
- భారీగా భారత్-యూఏఈ విమాన ఛార్జీలు..!!









