ఒమన్ లో తజావోబ్ ప్లాట్ ఫామ్ ప్రారంభం..!!
- October 07, 2025
మస్కట్: లబ్ధిదారులతో వ్యవహరించడంలో ప్రభుత్వ ఉద్యోగుల నైపుణ్యాలను పెంపొందించే శిక్షణా కార్యక్రమం మొదటి దశ మస్కట్లో ప్రారంభమైంది. ప్రతిపాదనలు, ఫిర్యాదులు మరియు నివేదికలను దాఖలు చేయడానికి జాతీయ సైట్ అయిన తజావోబ్ ప్లాట్ఫామ్ పై అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 230 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొంటున్నారు.
మస్కట్ గవర్నరేట్లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరచడం; ఖచ్చితమైన ఫీడ్ బ్యాక్ అందించడం, ఫాలో-అప్ చేయడం; ప్రభుత్వ సేవల మొత్తం నాణ్యతను మెరుగుపరచడం వంటి వాటిపై అవగాహన కల్పిస్తున్నారు. నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ సహకారంతో నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమం, ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల మధ్య నైపుణ్య మార్పిడిని పెంచే లక్ష్యంతో నిర్వహిస్తున్నారు.
తజావోబ్ ప్లాట్ఫారమ్ 54 ప్రభుత్వ సంస్థలను కలిగి ఉంది. ఇప్పటివరకు 86వేల కంటే ఎక్కువ లావాదేవీలను నమోదు చేసింది.
తాజా వార్తలు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!
- సలాలా పోర్టు లో ఎయిర్ క్వాలిటీ పై ఆందోళన వద్దు..!!
- ముగియనున్న మలేషియా మైగ్రంట్ రేపట్రియేషన్ ప్రోగ్రాం 2.0 ఆమ్నెస్టీ పథకం
- డల్లాస్ లో NATS బోర్డు సమావేశం NATS మరింత విస్తరణ దిశగా అడుగులు









