ఒమన్ లో తజావోబ్ ప్లాట్ ఫామ్ ప్రారంభం..!!
- October 07, 2025
మస్కట్: లబ్ధిదారులతో వ్యవహరించడంలో ప్రభుత్వ ఉద్యోగుల నైపుణ్యాలను పెంపొందించే శిక్షణా కార్యక్రమం మొదటి దశ మస్కట్లో ప్రారంభమైంది. ప్రతిపాదనలు, ఫిర్యాదులు మరియు నివేదికలను దాఖలు చేయడానికి జాతీయ సైట్ అయిన తజావోబ్ ప్లాట్ఫామ్ పై అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 230 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొంటున్నారు.
మస్కట్ గవర్నరేట్లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరచడం; ఖచ్చితమైన ఫీడ్ బ్యాక్ అందించడం, ఫాలో-అప్ చేయడం; ప్రభుత్వ సేవల మొత్తం నాణ్యతను మెరుగుపరచడం వంటి వాటిపై అవగాహన కల్పిస్తున్నారు. నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ సహకారంతో నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమం, ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల మధ్య నైపుణ్య మార్పిడిని పెంచే లక్ష్యంతో నిర్వహిస్తున్నారు.
తజావోబ్ ప్లాట్ఫారమ్ 54 ప్రభుత్వ సంస్థలను కలిగి ఉంది. ఇప్పటివరకు 86వేల కంటే ఎక్కువ లావాదేవీలను నమోదు చేసింది.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









