ఒమన్ లో తజావోబ్ ప్లాట్ ఫామ్ ప్రారంభం..!!
- October 07, 2025
మస్కట్: లబ్ధిదారులతో వ్యవహరించడంలో ప్రభుత్వ ఉద్యోగుల నైపుణ్యాలను పెంపొందించే శిక్షణా కార్యక్రమం మొదటి దశ మస్కట్లో ప్రారంభమైంది. ప్రతిపాదనలు, ఫిర్యాదులు మరియు నివేదికలను దాఖలు చేయడానికి జాతీయ సైట్ అయిన తజావోబ్ ప్లాట్ఫామ్ పై అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 230 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొంటున్నారు.
మస్కట్ గవర్నరేట్లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరచడం; ఖచ్చితమైన ఫీడ్ బ్యాక్ అందించడం, ఫాలో-అప్ చేయడం; ప్రభుత్వ సేవల మొత్తం నాణ్యతను మెరుగుపరచడం వంటి వాటిపై అవగాహన కల్పిస్తున్నారు. నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ సహకారంతో నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమం, ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల మధ్య నైపుణ్య మార్పిడిని పెంచే లక్ష్యంతో నిర్వహిస్తున్నారు.
తజావోబ్ ప్లాట్ఫారమ్ 54 ప్రభుత్వ సంస్థలను కలిగి ఉంది. ఇప్పటివరకు 86వేల కంటే ఎక్కువ లావాదేవీలను నమోదు చేసింది.
తాజా వార్తలు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!







