ఒమన్ లో తజావోబ్ ప్లాట్ ఫామ్ ప్రారంభం..!!
- October 07, 2025
మస్కట్: లబ్ధిదారులతో వ్యవహరించడంలో ప్రభుత్వ ఉద్యోగుల నైపుణ్యాలను పెంపొందించే శిక్షణా కార్యక్రమం మొదటి దశ మస్కట్లో ప్రారంభమైంది. ప్రతిపాదనలు, ఫిర్యాదులు మరియు నివేదికలను దాఖలు చేయడానికి జాతీయ సైట్ అయిన తజావోబ్ ప్లాట్ఫామ్ పై అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 230 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొంటున్నారు.
మస్కట్ గవర్నరేట్లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరచడం; ఖచ్చితమైన ఫీడ్ బ్యాక్ అందించడం, ఫాలో-అప్ చేయడం; ప్రభుత్వ సేవల మొత్తం నాణ్యతను మెరుగుపరచడం వంటి వాటిపై అవగాహన కల్పిస్తున్నారు. నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ సహకారంతో నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమం, ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల మధ్య నైపుణ్య మార్పిడిని పెంచే లక్ష్యంతో నిర్వహిస్తున్నారు.
తజావోబ్ ప్లాట్ఫారమ్ 54 ప్రభుత్వ సంస్థలను కలిగి ఉంది. ఇప్పటివరకు 86వేల కంటే ఎక్కువ లావాదేవీలను నమోదు చేసింది.
తాజా వార్తలు
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు







