పియూష్ గోయల్‌తో ఖతార్ కామర్స్ మినిస్టర్ భేటీ..!!

- October 08, 2025 , by Maagulf
పియూష్ గోయల్‌తో ఖతార్ కామర్స్ మినిస్టర్ భేటీ..!!

దోహా: ఖతార్ లో పర్యటిస్తున్న భారత వాణిజ్య మరియు పరిశ్రమల శాఖల మంత్రి పియూష్ గోయల్‌తో ఖతార్ వాణిజ్య వ్యవహారాల సహాయ మంత్రి డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ సయ్యద్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక వాణిజ్య మరియు పెట్టుబడి సంబంధాలపై సమీక్షించారు.

రెండు దేశాల బలమైన వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఇరువురు నేతలు అంగీకరించారు. వివిధ రంగాల్లో వాణిజ్య సంబంధాలను విస్తరించడానికి అందుబాటులో ఉన్న మార్గాలపై వారు చర్చించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై రెండు దేశాల అభిప్రాయాలను షేర్ చేసుకున్నారని అధికార వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com