ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక..స్వాగతించిన సౌదీ క్యాబినెట్..!!
- October 08, 2025
రియాద్: గాజాలో యుద్ధాన్ని ముగించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనపై తీసుకున్న చర్యలను సౌదీ క్యాబినెట్ స్వాగతించింది. క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ రియాద్లో జరిగిన క్యాబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించారు.
సెషన్ తర్వాత మీడియా మంత్రి సల్మాన్ అల్-డోసరీ మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రాంతీయ పరిణామాలను, ముఖ్యంగా ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లోని పరిస్థితిని కేబినెట్ చర్చించిందని చెప్పారు. సౌదీ అరేబియా నిర్వహించే అన్ని అంతర్జాతీయ సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లను కౌన్సిల్ సమీక్షించిందని తెలిపారు.
ఇటీవల అల్-ఉలాలో జరిగిన మ్యూనిచ్ భద్రతా సదస్సు సమావేశాన్ని విజయవంతం చేసిన వారిని కేబినెట్ ప్రశంసించింది. ప్రాంతీయ పరిణామాలు, ప్రపంచ ఆహార భద్రత, వాతావరణం మరియు ఇంధన సమస్యలు, అంతర్జాతీయ వాణిజ్యం , ఆర్థిక సహకారంపై అభిప్రాయాలను షేర్ చేసుకోవడంపై దృష్టి పెట్టిందన్నారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









