Dh1కి 10 కిలోల అదనపు లగేజ్..ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్..!!
- October 08, 2025
యూఏఈ: ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ గల్ఫ్లోని భారతీయ ప్రవాసుల కోసం ఒక అద్భుతమైన పండుగ ఆఫర్ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా ప్రయాణీకులు భారతదేశానికి వెళ్లే విమానాలలో కేవలం Dh1 చెల్లించి 10 కిలోగ్రాముల అదనపు లగేజీని తీసుకెళ్లవచ్చు.
పెద్ద సంఖ్యలో భారతీయులలో పండుగ ఉత్సాహాన్ని నింపేందుకు ఉద్దేశించిన ఈ ప్రమోషన్ అక్టోబర్ 31వరకు చేసిన బుకింగ్లకు, నవంబర్ 30 వరకు ప్రయాణాలకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ ఆఫర్ యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఒమన్, బహ్రెయిన్ మరియు ఖతార్తో సహా అన్ని గల్ఫ్ గమ్యస్థానాల నుండి కొనుగోలు చేసిన టిక్కెట్లకు వర్తిస్తుందని ఎయిర్ ఇండియా వెల్లడించింది.
ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ మరియు టాటా గ్రూప్లో భాగమైన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్.. దుబాయ్, షార్జా, అబుదాబి, మస్కట్, దమ్మామ్ మరియు దోహా నుంచి 20 కంటే ఎక్కువ భారతీయ నగరాలకు ఫ్లైట్ సర్వీసులను నడుపుతోంది.
తాజా వార్తలు
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు







