ఫోర్బ్స్ సంపన్నుల జాబితా..దేశంలో అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ..
- October 09, 2025
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. దేశంలోని 100 మంది అగ్రగామి కుబేరుల జాబితాను ఫోర్బ్స్ గురువారం విడుదల చేసింది. ఈ జాబితాలో ముకేశ్ టాప్ ప్లేస్ లో నిలిచారు.
ప్రస్తుతం ముకేశ్ అంబానీ నికర ఆదాయం సుమారు 105 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే, గత సంవత్సరంతో పోలిస్తే మాత్రం 12శాతం 14శాతం ఆదాయం క్షీణించింది. ఇదిలాఉంటే.. రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలి కమ్యూనికేషన్ సంస్థ జియో పబ్లిక్ ఇష్యూకు రానుంది. 2026 తొలి అర్ధభాగంలో తాము ఐపీవోకు వస్తున్నట్లు రిలయన్స్ సీఎండీ ముకేశ్ అంబానీ వార్షిక సమావేశంలో వెల్లడించారు. మరోవైపు.. కృత్రిమమేధను విస్తృతంగా వినియోగంలోకి తెచ్చేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్కు అనుబంధంగా ‘రిలయన్స్ ఇంటెలిజెన్స్’ ఏర్పాటు గురించి ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
భారతదేశంలో 100 మంది అగ్రగామి కుబేరుల పోర్బ్స్ జాబితాలో గౌతమ్ అదానీ రెండో స్థానంలో నిలిచారు. 92 బిలియన్ డాలర్లతో రెండో స్థానాన్ని సొంతం చేసుకోగా.. ఓపీ జిందాల్ గ్రూప్నకు చెందిన సావిత్రి జిందాల్ 40.2 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో నిలిచారు. టెలికాం దిగ్గజం సునీల్ మిట్టల్ నాల్గో స్థానంలో నిలవగా.. అతని సంపద 34.2 బిలియన్ డాలర్లు. ఈ సంవత్సరం అత్యధికంగా డాలర్లు సంపాదించిన వ్యక్తిగా సునీల్ మిట్టల్ నిలిచారు. ఇక టెక్ బిలియనీర్ శివ నాడార్ ఐదో స్థానంలో నిలిచారు. ఆయన సంపద 33.2బిలియన్ డాలర్లు.
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా, వీసా ట్రేడింగ్..ఆఫీసుపై రైడ్స్..!!
- సౌదీ బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డా..తల్లిదండ్రులను కోల్పోయాడు..!!
- బహ్రెయిన్-నాటో సంబంధాల్లో కొత్త అధ్యాయం..!!
- బౌషర్లో శాంతికి భంగం..122 మంది అరెస్ట్..!!
- ఖలీఫా అల్ అత్తియా ఇంటర్చేంజ్ మూసివేత..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ను స్వాగతించిన ట్రంప్..!!
- సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
- సహాంలో పది మంది అరెస్టు..!!







