దుబాయ్-ఢిల్లీ ప్రయాణికులకు షాకిచ్చిన స్పైస్జెట్..!!
- October 09, 2025
యూఏఈ: దుబాయ్-ఢిల్లీ మధ్య ప్రయాణించిన ప్రయాణికులకు స్పైస్జెట్ సంస్థ షాకిచ్చింది. బుధవారం సాయంత్రం దుబాయ్ నుండి న్యూఢిల్లీకి వెళ్లిన స్పైస్జెట్ ఫ్లైట్ ప్రయాణీకుల లగేజీ లేకుండానే బయలుదేరి వెళ్లింది. 148 మంది ప్రయాణికులతో కూడిన SG-12 విమానం గంట ఆలస్యంగా బయలుదేరి, భారత సమయం ప్రకారం సాయంత్రం 5 గంటలకు ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 3 వద్ద ల్యాండ్ అయింది. అనంతరం కన్వేయర్ బెల్ట్ చుట్టూ లగేజీ కోసం ప్రయాణికులు చేరుకున్నారు. కానీ అక్కడకు ఒక్కరి లగేజీ కూడా రాలేదు. లగేజీని ఫ్లైట్ సిబ్బంది దుబాయ్ లోనే వదిలేసి వచ్చారని తెలియగానే వారంతా షాక్ కు గురయ్యారు. దీనిపై ప్రయాణికులు సోషల్ మీడియాలో స్పైస్జెట్ నిర్లక్ష్యంపై దుమ్మెత్తిపోశారు. గంట ఆలస్యంగా బయలుదేరినా.. లగేజీని మర్చిపోవడం తమను షాక్ కు గురిచేసిందని దీపక్ అనే మరో ప్రయాణీకుడు X లో పేర్కొన్నాడు.
కాగా, విమానయాన సిబ్బంది ప్రయాణికులను బ్యాగేజ్ ఇర్రెగ్యులారిటీ రిపోర్ట్స్ (BIRలు) నింపమని కోరినట్లు, వారి లగేసీని తదుపరి అందుబాటులో ఉన్న సర్వీస్ లో తీసుకొస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో శాశ్వత శాంతి కోసం బహ్రెయిన్ పిలుపు..!!
- విషాదం..దుక్మ్ ప్రమాదంలో మరణించిన వ్యక్తుల గుర్తింపు..!!
- దుబాయ్-ఢిల్లీ ప్రయాణికులకు షాకిచ్చిన స్పైస్జెట్..!!
- GCC e-గవర్నమెంట్ అవార్డుల్లో మెరిసిన ఖతార్..!!
- కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనల పై భారీ జరిమానాలు..!!
- నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న సౌదీ శాస్త్రవేత్త ఒమర్ యాఘి..!!
- ఫోర్బ్స్ సంపన్నుల జాబితా..దేశంలో అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ..
- భారత్-యూకేల మధ్య వాణిజ్య ఒప్పందం
- కలుషిత దగ్గు సిరప్ కేసులో శ్రీసన్ ఫార్మా ఓనర్ అరెస్ట్
- బహ్రెయిన్లో వలస కార్మికుల సంఘానికి కొత్త కమిటీ..!!