షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- October 12, 2025
షార్జా: షార్జాలో ఇటీవల ఇద్దరు పాదచారుల మరణం తర్వాత షార్జా పోలీసులు జైవాకర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నిర్దేశించని ప్రాంతాల నుండి రోడ్డును దాటడం పాదచారుల మరణాలకు ప్రధాన కారణాలలో ఒకటిగా ఉందని షార్జా పోలీసుల ట్రాఫిక్ మరియు పెట్రోల్స్ విభాగం డైరెక్టర్ కల్నల్ మొహమ్మద్ అలై అల్ నక్బీ అన్నారు. పాదచారుల క్రాసింగ్లు, బ్రిడ్జి మరియు టన్నెల్స్ ను ఉపయోగించాలని సూచించారు. ఎల్లప్పుడూ ట్రాఫిక్ సిగ్నల్లను పాటించాలని అల్ నక్బీ కోరారు.
జైవాకర్లను ఉల్లంఘించేవారిని గుర్తించడానికి పోలీసు గస్తీ మరియు స్మార్ట్ పర్యవేక్షణ పరికరాలను ఏర్పాటు చేసినట్లు అల్ నక్బీ చెప్పారు. యూఏఈ ఫెడరల్ ట్రాఫిక్ చట్టం ప్రకారం, అలాంటి వారికి Dh400 జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. ఇక ట్రాఫిక్ ప్రమాదానికి కారణమైతే జైవాకర్లకు జైలు శిక్షతో పాటు Dh10,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







