షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- October 12, 2025
షార్జా: షార్జాలో ఇటీవల ఇద్దరు పాదచారుల మరణం తర్వాత షార్జా పోలీసులు జైవాకర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నిర్దేశించని ప్రాంతాల నుండి రోడ్డును దాటడం పాదచారుల మరణాలకు ప్రధాన కారణాలలో ఒకటిగా ఉందని షార్జా పోలీసుల ట్రాఫిక్ మరియు పెట్రోల్స్ విభాగం డైరెక్టర్ కల్నల్ మొహమ్మద్ అలై అల్ నక్బీ అన్నారు. పాదచారుల క్రాసింగ్లు, బ్రిడ్జి మరియు టన్నెల్స్ ను ఉపయోగించాలని సూచించారు. ఎల్లప్పుడూ ట్రాఫిక్ సిగ్నల్లను పాటించాలని అల్ నక్బీ కోరారు.
జైవాకర్లను ఉల్లంఘించేవారిని గుర్తించడానికి పోలీసు గస్తీ మరియు స్మార్ట్ పర్యవేక్షణ పరికరాలను ఏర్పాటు చేసినట్లు అల్ నక్బీ చెప్పారు. యూఏఈ ఫెడరల్ ట్రాఫిక్ చట్టం ప్రకారం, అలాంటి వారికి Dh400 జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. ఇక ట్రాఫిక్ ప్రమాదానికి కారణమైతే జైవాకర్లకు జైలు శిక్షతో పాటు Dh10,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







