షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- October 12, 2025
షార్జా: షార్జాలో ఇటీవల ఇద్దరు పాదచారుల మరణం తర్వాత షార్జా పోలీసులు జైవాకర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నిర్దేశించని ప్రాంతాల నుండి రోడ్డును దాటడం పాదచారుల మరణాలకు ప్రధాన కారణాలలో ఒకటిగా ఉందని షార్జా పోలీసుల ట్రాఫిక్ మరియు పెట్రోల్స్ విభాగం డైరెక్టర్ కల్నల్ మొహమ్మద్ అలై అల్ నక్బీ అన్నారు. పాదచారుల క్రాసింగ్లు, బ్రిడ్జి మరియు టన్నెల్స్ ను ఉపయోగించాలని సూచించారు. ఎల్లప్పుడూ ట్రాఫిక్ సిగ్నల్లను పాటించాలని అల్ నక్బీ కోరారు.
జైవాకర్లను ఉల్లంఘించేవారిని గుర్తించడానికి పోలీసు గస్తీ మరియు స్మార్ట్ పర్యవేక్షణ పరికరాలను ఏర్పాటు చేసినట్లు అల్ నక్బీ చెప్పారు. యూఏఈ ఫెడరల్ ట్రాఫిక్ చట్టం ప్రకారం, అలాంటి వారికి Dh400 జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. ఇక ట్రాఫిక్ ప్రమాదానికి కారణమైతే జైవాకర్లకు జైలు శిక్షతో పాటు Dh10,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







