యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- October 12, 2025
మస్కట్: అక్టోబర్ 12 నుండి ఒమన్ మరియు ఇతర యూరోపియనేతర దేశాల ప్రయాణికులకు సంబంధించి కొత్త ఎంట్రీ/ఎగ్జిట్ సిస్టమ్ నేటి నుంచి అమల్లోకి వచ్చింది. 29 EU దేశాలలో సాంప్రదాయ పాస్పోర్ట్ స్టాంపులను ఇకపై ఆటోమేటెడ్ బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్తో భర్తీ చేస్తారు.
ప్రతి ప్రయాణికుడి ఫేస్, ఫింగర్ ఫ్రింగ్స్ సహా పాస్పోర్ట్ వివరాలు ఇప్పుడు స్కెంజెన్ ప్రాంతం నుండి ఎంట్రీ, ఎగ్జిట్ సమయంలో డిజిటల్గా నమోదు అవుతాయి. అయితే, 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఫోటోగ్రాఫ్ను మాత్రమే అనుమతిస్తారు.
డిజిటల్ ఎంట్రీ/ఎగ్జిట్ సిస్టమ్ (EES) ఏదైనా 180 రోజుల వ్యవధిలో 90 రోజుల వరకు రెసిడెన్సీ ఉన్న అన్ని స్కెంజెన్ దేశాలకు ప్రయాణించే వారికి వర్తిస్తుంది. కాగా, EU పౌరులు, నివాసితులు మరియు దీర్ఘకాలిక వీసాలు లేదా నివాస అనుమతులు కలిగి ఉన్నవారికి మినహాయింపు ఇచ్చారు.
EES దీర్ఘకాలికంగా సరిహద్దు విధానాలను వేగవంతం చేస్తుందని, ఓవర్స్టేలు, గుర్తింపు ఫ్రాడ్స్, అక్రమ వలసలను గుర్తించడంలో అధికారులకు సహాయపడుతుందని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







