కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- October 12, 2025
కువైట్: కువైట్ లోని పలు ప్రాంతాల్లో వాటర్ కొరత వేధిస్తోంది. ప్రస్తుతం అనేక వాటర్ ఉత్పత్తి ప్లాంట్లలో నిర్వహణ కార్యకలాపాల కారణంగా కొరత ఏర్పడిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. కొరతను తీర్చేందుకు దేశంలోని వ్యూహాత్మక నిల్వల నుండి వాటర్ ను తీసుకుంటున్నట్లు తెలిపింది. అదే సమయంలో వాటర్ ఉత్పత్తిని ముమ్మరం చేసేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొంది.
మంత్రిత్వ శాఖ తాజా డేటా ప్రకారం.. నీటి వినియోగం 501 మిలియన్ గ్యాలన్లకు చేరుకుంది. ఇది 446 మిలియన్ గ్యాలన్ల ఉత్పత్తి రేటును అధిగమించింది. 55 మిలియన్ గ్యాలన్ల తేడా నమోదైంది. మంత్రిత్వ శాఖ ప్రస్తుతం 3,275 మిలియన్ గ్యాలన్ల వ్యూహాత్మక నీటి నిల్వలను కలిగి ఉంది.
రాబోయే వేసవి కాలానికి సన్నాహకంగా మంత్రిత్వ శాఖ విద్యుత్ ప్లాంట్లు, వాటర్ ప్లాంట్లలో నిర్వాహణ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. కాగా, నీటి ఉత్పత్తి అధిక ఖర్చుతో కూడు కున్నదని, పౌరులు మరియు నివాసితులు నీటిని పొదుపుగా ఉపయోగించుకోవాలని కోరింది.
తాజా వార్తలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..







