కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- October 12, 2025
కువైట్: కువైట్ లోని పలు ప్రాంతాల్లో వాటర్ కొరత వేధిస్తోంది. ప్రస్తుతం అనేక వాటర్ ఉత్పత్తి ప్లాంట్లలో నిర్వహణ కార్యకలాపాల కారణంగా కొరత ఏర్పడిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. కొరతను తీర్చేందుకు దేశంలోని వ్యూహాత్మక నిల్వల నుండి వాటర్ ను తీసుకుంటున్నట్లు తెలిపింది. అదే సమయంలో వాటర్ ఉత్పత్తిని ముమ్మరం చేసేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొంది.
మంత్రిత్వ శాఖ తాజా డేటా ప్రకారం.. నీటి వినియోగం 501 మిలియన్ గ్యాలన్లకు చేరుకుంది. ఇది 446 మిలియన్ గ్యాలన్ల ఉత్పత్తి రేటును అధిగమించింది. 55 మిలియన్ గ్యాలన్ల తేడా నమోదైంది. మంత్రిత్వ శాఖ ప్రస్తుతం 3,275 మిలియన్ గ్యాలన్ల వ్యూహాత్మక నీటి నిల్వలను కలిగి ఉంది.
రాబోయే వేసవి కాలానికి సన్నాహకంగా మంత్రిత్వ శాఖ విద్యుత్ ప్లాంట్లు, వాటర్ ప్లాంట్లలో నిర్వాహణ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. కాగా, నీటి ఉత్పత్తి అధిక ఖర్చుతో కూడు కున్నదని, పౌరులు మరియు నివాసితులు నీటిని పొదుపుగా ఉపయోగించుకోవాలని కోరింది.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







