కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- October 12, 2025
కువైట్: కువైట్ లోని పలు ప్రాంతాల్లో వాటర్ కొరత వేధిస్తోంది. ప్రస్తుతం అనేక వాటర్ ఉత్పత్తి ప్లాంట్లలో నిర్వహణ కార్యకలాపాల కారణంగా కొరత ఏర్పడిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. కొరతను తీర్చేందుకు దేశంలోని వ్యూహాత్మక నిల్వల నుండి వాటర్ ను తీసుకుంటున్నట్లు తెలిపింది. అదే సమయంలో వాటర్ ఉత్పత్తిని ముమ్మరం చేసేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొంది.
మంత్రిత్వ శాఖ తాజా డేటా ప్రకారం.. నీటి వినియోగం 501 మిలియన్ గ్యాలన్లకు చేరుకుంది. ఇది 446 మిలియన్ గ్యాలన్ల ఉత్పత్తి రేటును అధిగమించింది. 55 మిలియన్ గ్యాలన్ల తేడా నమోదైంది. మంత్రిత్వ శాఖ ప్రస్తుతం 3,275 మిలియన్ గ్యాలన్ల వ్యూహాత్మక నీటి నిల్వలను కలిగి ఉంది.
రాబోయే వేసవి కాలానికి సన్నాహకంగా మంత్రిత్వ శాఖ విద్యుత్ ప్లాంట్లు, వాటర్ ప్లాంట్లలో నిర్వాహణ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. కాగా, నీటి ఉత్పత్తి అధిక ఖర్చుతో కూడు కున్నదని, పౌరులు మరియు నివాసితులు నీటిని పొదుపుగా ఉపయోగించుకోవాలని కోరింది.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







